మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. అయితే అది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఒక్కోసారి అది కూడా నిజమే అనిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్న ఓ నటి ఫోటోలు చూస్తే ఇలాంటి విషయాలు కూడా నమ్మక తప్పదేమో అనిపిస్తుంది. కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ మరాఠి నటి ఫోటోలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

 

మరాఠి యాక్ట్రెస్‌ మాన్సీ నాయక్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మాన్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆమె అచ్చు ఐశ్వర్య రాయ్‌ లాగే కనిపించటంతో అభిమానులు వాటిని తెగ షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో మాన్సీ అచ్చు కెరీర్‌ స్టార్టింగ్‌ లో ఐశ్వర్య ఎలా ఉండేదో అలాగే ఉంది. దీంతో నెటిజెన్లు ఆమె ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

 

కొంతమంది నెటిజెన్లు `ఐశ్వర్యకు డూప్లికేట్‌` అంటే మరికొందరు `ఐశ్వర్యకు కార్బన్‌ కాపీ అంటూ మెసేజ్‌ లు చేస్తున్నారు. గతంలో నటి స్నేహ ఉల్లాల్‌ విషయంలో కూడా ఇలాంటి వార్తలే వినిపించాయి. సల్మాన్‌ ఖాన్ సరసన లక్కీ నో టైం ఫర్‌ లవ్‌ సినిమాలో నటించిన స్నేహ అప్పట్లో ఐశ్వర్య పోలికలతో హాట్‌ టాపిక్‌గా మారింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Mood 2020 : 12 New Chapters 365 New Chances 🙌🏻👸🏻🥀🧸❤️ #Queen #Actor #Performer #ExcitedForANewTravel

A post shared by manasi Naik (@manasinaik0302) on

మరింత సమాచారం తెలుసుకోండి: