ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా. ఈ వైరస్ భయంతో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా 8 వేల మందికి పైగా ప్రజలు మరణించగా 2 లక్షల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. మన దేశంలోనే దాదాపు 169 మంది ఈ వైరస్ భారిన పడినట్టుగా తెలుస్తోంది. ముగ్గురు ప్రాణాలు వదిలారు. దీంతో మన ప్రభుత్వాలు కూడా తక్షణ చర్యలకు దిగాయి.
ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీ స్మృతి ఇరానీ విసిరిన చాలెంజ్ లో భాగంగా టెలివిజన్ నిర్మాత ఎక్తా కపూర్ సేఫ్ హ్యండ్స్ చాలెంజ్ను స్వీకరించింది. అందులో భాగంగా తాను చేతులు కడుక్కుంటున్న వీడియోను రిలీజ్ సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసింది.
అయితే ఈ వీడియోనే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. తన చేతికి ఉన్న ఉంగరాలు, వాచీ, బ్రాస్లెట్లూ తీయకుండానే చేతులు కడుక్కున్న ఎక్తాపై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నీ జ్యువెలరీలోనే వంద వైరస్లు ఉంటాయి. నువ్వు కొద్ది రోజులు కొన్ని రింగులు, బ్రాస్ లెట్ లు తక్కువ వాడితే బెటర్ అంటూ మరో నెటిజెన్ సలహా ఇచ్చాడు. ఈ చాలెంజ్లో భాగంగా దీపికా పదుకొనే, అనుష్క శర్మ లాంటి వారు కూడా చేతులు కడుక్కొంటున్న వీడియోలను షేర్ చేశారు.