మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ,ప్రస్థానం ఫేమ్  దేవ కట్టా డైరెక్షన్ లో తన 14వ చిత్రాన్ని చేయనున్నాడని తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది. ఇక ఈచిత్రం గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. సోషియో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో  సాయి ధరమ్ డాక్టర్ గా నటించనుండగా ప్రముఖ నటి రమ్యకృష్ణ  ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుందని సమాచారం. మొదట ఈ పాత్ర కు విజయశాంతిని తీసుకుందాం అనుకున్నారు ఆమె ఒప్పుకోకపోవడం తో రమ్యకృష్ణ  కు ఈ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈ చిత్రం ఏప్రిల్ 20  నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో 27రోజుల్లో పూర్తి చేసి తరువాత ఏలూరు, కొల్లేరు లేక్ తదితర ప్రాంతాల్లో మిగితా షెడ్యూల్ లను పూర్తి చేయనున్నారు.  నివేత పేతురాజ్ కథానాయికగా నటించనుండగా మణిశర్మ సంగీతం అందించనున్నాడు. భగవాన్, పుల్ల రావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు లో విడుదలకానుంది. 
 
ఇక ఏకంగా డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తరువాత  గత ఏడాది చిత్ర లహరి, ప్రతి రోజు పండుగే తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి పుల్ ఫామ్ లోకి వచ్చిన  సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సుబ్బు డైరెక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాబా నటేష్ హీరోయిన్ కాగా  థమన్ సంగీతం అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1 న విడుదలకానుంది. మరి ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి సాయి ధరమ్ హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: