ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఫుల్‌ ఫాంలో ఉన్న అందాల భామ పూజా హెగ్డే. తెలుగులో వరుస ఆఫర్‌ లతో బిజీగా ఉన్న ఈ భామ బాలీవుడ్‌ మీద దృష్టి పెట్టింది. తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్న ఈ ముద్దుగుమ్మ మాత్రం హిందీ సినిమాకే తొలి ఓటు అంటుందట. అంతేకాదు.. అక్కడ సినిమాల్లో నటించేందుకు భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ హీరో సినిమాలో నటించేందుకు అడిగిన పారితోషికం విని నిర్మాతలు షాక్ తిన్నారట.

 

బాలీవుడ్‌ లో మొహెంజోదారో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజాకు తొలి సినిమాతో నిరాశే ఎదురైంది. ఆ సినిమా ఆశించిన ఆస్థాయిలో సక్సెస్ కాకపోవటంతో అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు, అయితే అదే సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులు ఈ ముద్దుగుమ్మను బాగానే ఆదరించారు. వరుస అవకాశాలు రావడంతో ఇక్కడ స్టార్ స్టేటస్ అందుకుంది పూజా. అదే జోరులో ఇటీవల బాలీవుడ్‌లోనూ సక్సెస్ అందుకుంది. హౌజ్‌ఫుల్‌ 4 సినిమాతో బాలీవుడ్‌ లో తొలి సక్సెస్ అందుకుంది.

 

తాజాగా సల్మాన్‌ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కబీ ఇద్‌ కబీ దీవాలి సినిమా కోసం పూజా ను సంప్రదించారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమాలో నటించేందుకు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తుందట పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ భామ ఒక్కో సినిమాకు కోటీ రూపాయల వరకు పారితోషికం అందుకుంటోంది. కానీ సల్మాన్ సినిమాలో నటించేందుకు ఏకంగా 4 కోట్ల పారితోషికం అడిగిందట పూజ. అయితే ప్రస్తుతం పూజ ఫుల్‌ ఫాంలో ఉండటంతో అంత మొత్తం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. 

 

ఈ సినిమాను 2021 ఈద్‌కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫర్హాద్‌ సంజీ దర్శకుడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: