క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ రవితేజకి లైఫ్ ఇచ్చాడని చెప్పాలి. సిందూరం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరో రవితేజ అప్పటి వరకు చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసిన రవితేజని మంచి సినిమాల్లో తీసుకుని కథ పరంగా హిట్లు ఇచ్చి ఓస్టార్ డమ్ని తీసుకొచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కొన్ని సినిమాలు తీసుకుంటే ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ఈ చిత్రం హిట్ అయి మంచి విజయం సాధించింది. ఇక ఇడియట్ చిత్రమయితే రవితేజ కెరియర్లో మరో మైలురాయి అని చెప్పాలి. చిన్న సినిమాలు చేసుకునే రవితేజని ఒకేసారి పూరి ఇడియట్ చిత్రంతో మాస్ మహారాజా క్రేజ్ని తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలో ఉండే ప్రతి డైలాగ్ ప్రతి సన్నివేశం సూపర్ అని చెప్పాలి. అలాగే హీరో హరోయిన్ని ఏరా పోరా అనే డైలాగ్స్ పూరి చిత్రం నుంచే మొదలయ్యాయని చెప్పొచ్చు. ఆరకమైన ట్రెండ్ని స్టార్ చేసింది పూరినే.
ఇక సిటీకి ఎంత మంది వచ్చినా చంటిగాడు లోకల్ అనే డైలాగ్ ఇప్పటికి ఎంత హైలెట్ అయిందంటే. ఆ డైలాగ్ ఇప్పటికి ప్రతి ఒక్కరి నోళ్ళల్లో నానుతుంది. ఇక అమ్మానాన్న ఓ తమిళమ్మాయి చిత్రం ఓ ట్రెండ్ని సృష్టించిందని చెప్పాలి. అందులో జయసుధ రవితేజకి మధ్య వచ్చే సాంగ్ చాలా బావుంటుంది. తల్లి కొడుకు మధ్య ఓ కొత్త ట్రెండ్ సృష్టించినట్టుంది. ఆ తర్వాత రవితేజ ప్రకాష్రాజ్ మధ్య వచ్చే ప్రతి సన్నివేశం సూపర్డూపర్ హిట్ అని చెప్పాలి. అలాగే ఆ చిత్రంలోని పాటలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. అప్పట్లో ప్రతి ఆటోవాడి దగ్గర ఈ పాటలే వినిపించేవి. అంతలా ఆ చిత్రంలోని సాంగ్స్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన దేవుడు చేసిన మనుషులు, నేనింతే పెద్దగా హిట్ కాలేకపోయాయి. మరి మళ్ళీ ఇప్పుడు వీరిద్దరు కలిసి సినిమా చేసే ఆలోచన ఏమన్నా ఉందో లేదో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.