కరోనా దెబ్బ ఇప్పుడు సినీ పరిశ్రమకు మామూలుగా తగల్లేదు. సాధారణ ప్రజలకు ఏ విధంగా చుక్కలు చూపిస్తుందో ఇప్పుడు అదే స్థాయిలో సినీ పరిశ్రమకు కూడా చుక్కలు చూపిస్తుంది కరోనా వైరస్. ఎక్కడిక్కడ వేగంగా విస్తరిస్తూ ప్రజలను అన్ని రకాలుగా ఈ వైరస్ ఇబ్బంది పెడుతుంది. ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. దేశంలో మరణాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే దాదాపు 200 మందికి కరోనా వైరస్ ఒకింది. 

 

ఇక ఇది పక్కన పెడితే దక్షినాదికి చెందిన ఒక స్టార్ హీరోకి కూడా కరోనా వైరస్ సోకినట్టు ప్రచారం జరుగుతుంది. సదరు స్టార్ హీరో ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చాడని అతన్ని చెన్నై లో ఒక స్టార్ హాస్పిటల్ లో ఉంచి చికిత్స చేస్తున్నారని అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అంటున్నారు. అతని కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరికి కరోనా వైరస్ సోకింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఈ వైరస్ ని కట్టడి చేయడం ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరూ అనేది మాత్రం స్పష్టత రావడం లేదు. 

 

అతను తమిళనాడు కి చెందిన వ్యక్తి కాదని, మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బ మాత్రం దేశానికి చుక్కలు చూపిస్తుంది అనే మాట వాస్తవం. ప్రస్తుతం ఈ వైరస్ సోకినా వారి సంఖ్య తెలంగాణాలో 13 కి చేరింది. విదేశాల నుంచి వచ్చిన వారికి ఈ కరోనా వైరస్ సోకింది అంటున్నారు. త్వరలోనే అతని వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచార౦ బయటకు రావాల్సి ఉంది. అతని ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: