కొంత కాలంగా సినిమాలకు దూరంగా వున్న సౌత్ హీరోయిన్ శృతి హాసన్ మళ్ళీ బిజీ అవుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ లో నటిస్తుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్నినట్లుగా తెలుస్తుంది. గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా వున్న
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో
శృతి హాసన్ ,
పవన్ కు జోడీగా నటించనుంది. కాగా వీరిద్దరూ జంటగా నటించడం ఇది రెండో సారి.
ఇంతకుముందు
గబ్బర్ సింగ్ లో జోడిగా నటించగా ఆ
సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇటీవలే వకీల్ సాబ్ సెట్స్ మీదకు వెళ్లగా .. సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే
కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో మే లో విడుదకావాల్సిన ఈ చిత్రం జులై లో రానుందని సమాచారం.
బాలీవుడ్ సూ
పర్ హిట్
మూవీ పింక్ కు
రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో
పవన్ లాయర్ గా నటిస్తుండగా
యువ హీరోయిన్లు
అంజలి,
నివేత థామస్,
అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సోషల్ మెసేజ్ తో వేణు
శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి
థమన్ సంగీతం అందిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన
బోనీ కపూర్ తో కలిసి
దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు
పవన్ కళ్యాణ్, ఇటీవలే క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో కూడా ఓ సినిమాను మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారం లో వుంది. ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం లో
అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో కనిపించనుంది.