టాలీవుడ్ లో అజ్ఞాతవాసి తర్వాత రాజకీయాల్లో బిజీగా గడిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడు వరుస సినిమాలకు ఓకే చెప్పారు.  ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రిమేక్ ‘వకీల్ సాబ్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా... దిల్ రాజు నిర్మిస్తున్నారు.  ఈ మూవీ ఇప్పటికే తుది దశకు చేరుకోగా కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల కొంత కాలం వాయిదా వేశారు.  ఈ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడికల్ మూవీలో నటించబోతున్నారు పవన్ కళ్యాన్.  ఇది పవన్ కళ్యాన్ కి 27వ సినిమా. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. అయితే ఈ సినిమా ఓ పిరియాడికల్ మూవీగా తెరకెక్కబోతుంది.

 

ఇందులో పవన్ కళ్యాన్ ఓ బందిపోటు దొంగగా కనిపించబోతున్నాడు.  వాస్తవానికి ఈ మూవీ ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసుకొని రావాల్సి ఉన్నా.. ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంటే వచ్చే ఏడాదే ఈ మూవీ రిలీజ్ కావొచ్చు అంటున్నారు. ఇక సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సాహెూ’ ఫ్లాప్ దర్వాత జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇక డార్లింగ్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీ గా తెరపైకెక్కుతుందని తెలుస్తుంది.

 

ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 'ఓ డియర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇప్పుడు కరోనా కారణంగా  బ్రేక్ పడింది. షూటింగ్ ను వాయిదా వేశారు చిత్రయూనిట్.  ఈ నేపథ్యంలో ప్రభాస్ మూవీ కూడా ఆలస్యం అయ్యే అవకావం కనిపిస్తుంది. అంటే వచ్చే ఏడాది గనక ఈ మూవీ రిలీజ్ అయితే టాప్ హీరోలు పవన్, ప్రభాస్ ల మద్య గట్టి పోటే ఉండొచ్చు అని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: