అక్కినేని సమంత తన మాజీ ప్రియుడు, హీరో సిద్దార్థ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .... సిద్దార్థ్ విషయంలో ఏ మాత్రం నాన్చకుండా బయటకు రావడం తాను తీసుకున్న ఎంతో కీలకమైన నిర్ణయం అని అన్నారు. సిద్దార్థ్ తన జీవితంలో ఉండి ఉంటే మహానటి సావిత్రి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చాయో తన జీవితంలో కూడా అలాంటి కష్టాలు వచ్చేవని చెప్పారు. 
 
తాను ముందుగానే జాగ్రత్త పడటంతో ప్రస్తుత జీవితం సాఫీగా సాగిపోతుందని తెలిపారు. మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ గా అగ్ర స్థానంలో నిలిచిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు అర్థం చేసుకునే భర్త దొరికాడని, చైతన్య భగవంతుడు ఇచ్చిన కానుక అని ఆమె అన్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన జబర్దస్త్ సినిమాలో సమంత, సిద్దార్థ్ కలిసి నటించారు. 
 
ఆ సమయంలో సమంత, సిద్దార్థ్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. శ్రీ కాళహస్తిలో వీరిద్దరూ కలిసి రాహు కేతు పూజలు జరిపించినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ దూరమయ్యారు. ఆ తర్వాత 2017లో నాగచైతన్యతో సమంత వివాహం ఘనంగా జరిగింది. 
 
ప్రస్తుతం ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా సమంత నాగచైతన్యకు గుర్తింపు ఉంది. గత నెలలో సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జాను సినిమా విడుదలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తమిళంలో విజయ్ సేతుపతికి జోడీగా సమంత ఒక సినిమాలో నటిస్తోంది. సమంత మాజీ ప్రియుడు సిద్దార్థ్ గురించి ప్రస్తావించడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొందరు నెటిజన్లు సమంత సిద్దార్థ్ గురించి ప్రస్తావించడం అవసరమా...? అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: