అఖిల్ హీరో నితిన్ లు చాల అత్యంత సన్నిహితులు. అఖిల్ హీరో కాకముందు ఒక జిమ్ లో పరిచయం అయిన వీరిద్దరి పరిచయం ఘాడమైన స్నేహంగా మారింది. వాస్తవానికి అఖిల్ కన్నా నితిన్ వయసులో పెద్దవాడు అయినా వీరిద్దరి స్నేహం ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. 


ఇలాంటి పరిస్థితులలో అఖిల్ నితిన్ కు సంబంధించిన ఒక సమస్యను త్వరలో తీర్చబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అఖిల్ ను హీరోగా చేసి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తీసిన మొదటి మూవీ ‘అఖిల్’ ఘోర పరాజయం చెందడంతో నితిన్ తండ్రికి భారీగా నష్టాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. 


అయితే ఆ నష్టాలను తీర్చే బాధ్యతను ప్రస్తుతం అఖిల్ తీసుకున్నట్లు సమాచారం. గతంలో నాగార్జున నితిన్ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ మూవీ తరువాత సుధాకర్ రెడ్డి నిర్మించే మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి అఖిల్ ఒక్క రూపాయి కూడ పారితోషికంగా తీసుకోడట. 


ప్రస్తుతం ఈ అక్కినేని యంగ్ హీరో నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ మూవీ సూపర్ హిట్ అవుతుంది అన్న గట్టి నమ్మకం అఖిల్ కు ఏర్పడటంతో ఈ సినిమా తరువాత పెరిగే తన మార్కెట్ ను తన ప్రియ మిత్రుడు నితిన్ కి ఉపయోగించాలి అన్న ఉద్దేశం మంచిది అయినా అఖిల్ అంచనాలు అతడి లేటెస్ట్ మూవీ విషయంలో ఎంత నిజం అవుతాయో చూడాలి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలోని మొదటి పాట ‘మనసా మనసా’ ఇప్పటికే బాగా హిట్ అయిన పరిస్థితులలో అఖిల్ నమ్మకాలు మరింత పెరిగాయి. అయితే కరోనా దెబ్బతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడ ఆగిపోయిన పరిస్థితులలో వచ్చి సందడి చేయాలని కలలు కంటున్న అఖిల్ నమ్మకాలు ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి..     

మరింత సమాచారం తెలుసుకోండి: