ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ కూడా దాదాపు హై బడ్జెట్తోనే తెరకెక్కుతున్నాయి. సినిమాల ఎలా ఉంది దాని కథ కథనాలు ఏంటి అన్నది ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. అది ఎంత బడ్జెట్తో నిర్మిస్తున్నాము. ఒక్కో సీన్కి ఎంత ఖర్చుపెడుతున్నాము. ఆ సాంగ్ కోసం ఏ దేశం వెళ్ళాము వంటి క్రేజీ విషయాల పైన ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. ఇక దాంతోనే సగం సినిమాకి హైప్ తెచ్చేస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ ముందుగానే లీక్ చేస్తూ కొత్త ప్రమోషన్స్ ఇస్తూ సోషల్ మీడియాలో ఈ వార్తలన్నీ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. నేటి తరం మేకర్స్. దీంతో సినిమాకి ముందుగానే పిచ్చ రెస్పాన్స్ వచ్చేసి ప్రేక్షకుల్లో ఓ రేంజ్లో హైప్ పెంచేస్తున్నారు. మరి ఇదిలా ఉంటే... హై బడ్జెట్ సినిమా కదా అని తీరా సినిమాకి వెళితే అక్కడ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకుడు కాస్త నిరాశకి గురవుతున్నాడు. అయితే అది ముందుగానే ప్రిపేర్ అయి సినిమాకి వెళ్ళిలి కేవలం ఆ బడ్జెట్ చూడటం కోసమే సినిమాకి వెళ్ళాలని దాని నుంచి కథ కథనాలు ఆలోచించకూడదన్న ఆలోచన ప్రేక్షకుడిలో రావాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే...టాలీవుడ్ మార్కెట్ పరిధి చాలా పెరిగింది. ఒకప్పటికంటే చాలా మార్పులు వచ్చాయి. ఒక సినిమాకి వంద కోట్ల వసూళ్ళు అంటే ఇట్టే వచ్చేస్తున్నాయి. అందులో ఏమాత్రం అనుమానం ఉండడం లేదు. చిరంజీవి, మహేష్, చరణ్, ప్రభాస్ ఈ టాప్ స్టార్లైతే ఇప్పటికే వంద కోట్ల షేర్ సైతం దాటివేశారు. తాజాగా బన్నీ అల వైకుంఠపురంలో మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ నేపథ్యంలో ఇక స్టార్ హీరోల నుండి రాబోయే సినిమాలన్నీ కూడా దాదాపు భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. ప్రతి ఒక్కరూ ప్యాన్ ఇండియా మూవీస్నే ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీలో నటిస్తుండగా దాని బడ్జెట్ 400 కోట్లకు పైగా తెరకెక్కుతోంది. అది పాన్ ఇండియా మూవీ కాబట్టి దాన్ని పక్కన పెట్టినా, త్రివిక్రంతో ఆయన చేయబోయే సినిమా బడ్జెట్ వంద కోట్ల పైనే అని తెలుస్తుంది.
ఇక చిరంజీవి-కొరటాల చిత్రం విషయానికి వస్తే ఉహించినదానికి ఎక్కువగా పెట్టి తెరకెక్కిస్తున్నారని వినికిడి. అల వైకుంఠపురంలో మూవీతో తన మార్కెట్ రేంజ్ ఏంటో చూపించిన అల్లు అర్జున్, సుకుమార్ తో సినిమా చేస్తుండగా దీని కోసం మైత్రి మూవీమేకర్స్ కూడా కాస్త గట్టిగానే ఖర్చుపెట్టనున్నారట. ఇక పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్న విషయం తెలిసిందే. దీని బడ్జెట్ కూడా దాదాపు 150 కోట్లకు పైనే అని తెలుస్తుంది. ఇలా సౌత్ నుండి టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ చిత్రాలలో నటిస్తున్నారు. మరి ఇప్పుడు అందరికి కథ కంటే కూడా బడ్జెట్ ముఖ్యం అంటున్నారు చాలా మంది స్టార్ హీరోలు.