రవితేజ గత కొన్ని రోజులుగా వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్నాడు. రాజా ది గ్రేట్ చిత్రం తర్వాత మళ్ళీ హిట్ రాలేదు. మొన్నటికి మొన్న వచ్చిన డిస్కోరాజా చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా వల్ల రవితేజ మార్కెట్ ఘోరంగా దెబ్బతింది. అయితే మార్కెట్ దెబ్బతిన్నా కూడా రవితేజకి ఆఫర్లు తగ్గడం లేదు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు.

 


పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్న క్రాక్ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా ఉంటుందని టీజర్ ని బట్టి తెలుస్తుంది. అదీగాక ఈ సినిమా తమిళ చిత్రానికి రీమేక్ అని కూడా అంటున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. క్రాక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే రవితేజ మరో సినిమాని ఒప్పుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన రాక్షసుడు సినిమా దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట.

 


కోనేరు సత్యనారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుందట. రమేష్ వర్మ గత చిత్రాలైన సెవెన్, రాక్షసుడు కూడా కోనేరు సత్యనారాయణ నిర్మించినవే. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరు నిధి అగర్వాల్ కాగా మరొకరిని మాళవిక శర్మని ఎంచుకున్నారు. ఈమె గతంలో రవితేజతో నేల టికెట్టు సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమె అందంగా కనిపించలేదని, సినిమాకి మైనస్ గా మారిందని విమర్శలు వచ్చాయి.

 

 

అయినా కూడా రవితేజ మళ్ళీ మాళవికని తీసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అసలే ఫ్లాపులు ఎదురవుతున్న సమయంలో తను చేసే సినిమాల్లో ఆసక్తి  కలిగించే అంశాలు ఉంటే బెటర్ అని చెబుతున్నారు. మరి ఒక హీరోయిన్ నిధి అగర్వాల్ ఉందన్న ధైర్యంతోనే మాళవికని ఎంచుకుని ఉంటారని వినబడుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: