ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న మహమ్మారి కరోనాను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. మన దేశంలోనూ ఈ వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే 180కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే విధ్యా సంస్థలతో పాటు థియేటర్లు, పార్క్‌ లు, పబ్‌ లు మూసి వేయగా మరిన్ని కట్టుదిట్టమైన చర్చలు తీసుకుంటున్నారు.

 

ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు అభిమానులకు వైరస్‌ నుంచి తమని తాము కాపాడుకుంనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్‌ ఆర్యన్ కూడా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోను సోషల్ డిస్టాన్సింగ్ గురించి వివరించాడు కార్తీక్ ఆర్యన్. వీడియోతో పాటు నా సందేశం నా స్టైల్‌ లో. ఈ ప్రమాదం నుంచి బయట పడటానికి సోషల్ డిస్టాన్సింగ్ ఒక్కటే దారి. ప్రధాని నరేంద్ర మోడీ గారు మేం మీతో ఉన్నాం` అంటూ కామెంట్‌ చేశాడు.

 

ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తీక్‌ ఆర్యన్‌ ప్రస్తుతం అనీస్‌  బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భూల్‌ భులియా 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే వీడియో మెసేజ్‌లో కార్తీక్ చేతికి కట్టు ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My Appeal in my Style Social Distancing is the only solution, yet 🙏🏽

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

మరింత సమాచారం తెలుసుకోండి: