దర్శకధీరుడు రాజమౌళి ఇద్దరు టాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్లతో మొదలు పెట్టిన ఆర్ఆర్ఆర్ మూవీ ఇండియా వైడ్ గా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో తెలిసిన విషయమే. అయితే.. రాజమౌళికి తన కెరీర్లో ఎప్పుడూ ఎదురవ్వని సమస్యలు ఈ సినిమా ద్వారా ఎదుర్కొంటున్నాడని చెప్పాలి. అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రారంభంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాలవటం అనుకున్న షూటింగ్ వాయిదా పడటం జరిగాయి. అంతా సెట్ అయిందనుకుంటే ఎన్టీఆర్ కు జోడీగా సెలక్ట్ చేసుకున్న హీరోయిన్  డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

 

 

దీంతో ఎన్టీఆర్ హీరోయిన్ కోసం పెద్ద వేటే చేశాడు జక్కన్న. మొత్తానికి ఒలివియా మోరిస్ అనే మరో విదేశీ భామను తీసుకొచ్చాడు. షూటింగ్ ప్లాన్ చేసుకున్న పూణె షెడ్యూల్ కాస్తా పర్మిషన్ దొరక్క చెన్నైకు మారాల్సి వచ్చింది. ఇన్ని కారణాలతో తొలుత ప్రకటించిన రిలీజ్ డేట్ జూలై 30’ 2020 కాస్తా వాయిదా పడి 2021’ జనవరి 8కి రిలీజ్ డేట్ మార్చారు. ఇక షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని భావించిన రాజమౌళికి ప్రస్తుత పరిస్థితులు ఎదురొస్తున్నాయి. దేశమంతా కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్తబ్దుగా మారిపోయి షూటింగులు వాయిదా పడ్డాయి.

 

 

దీంతో ఇప్పుడు రామ్ చరణ్ కు హీరోయిన్ గా అనుకున్న  అలియా భట్ ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉందని వార్తలు వస్తున్నాయి. ముందుగా ఆమె ఇచ్చిన డేట్స్ టైమ్ లో రామ్ చరణ్ కు గాయం కావడం, తర్వాత సైరా ప్రమోషన్ల బిజీ కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు కరోనాతో మళ్లీ ఇబ్బందులు వస్తున్నాయి. మరోవైపు సినిమా స్టిల్స్ లీకులు కూడా జక్కన్నకు తలనొప్పిగా మారాయి. రాజమౌళి కెరీర్లో ఇప్పటివరకూ ఇలాంటి సమస్యలు ఏ సినిమాకు ఎదుర్కోలేదనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: