టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసే ప్రతి సినిమాకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.  కథ, మ్యూజిక్, ఫైట్స్, ఎమోషన్ సీన్లు ఇలాంటి వాటిపై ఆయన ప్రత్యేక శ్రద్ద వహిస్తుంటారు.  ముఖ్యంగా ఆయన సినిమాల్లో సాంగ్స్ విషయంలో గీత రచయిత తో పాటు సంగీత దర్శకుడిని కలుపుకొని దగ్గరుండి పాటలు కంపోజ్ చేయిస్తుంటారు.  ఇలా త్రివిక్రమ్ మూవీలో పాటలు దాదాపు అన్నీ హిట్ అన్న విషయం తెలిసిందే.  ఈ ఏడాది అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. దానికన్నా ముందు ఇందులోని సామజవరగమన, రాములో రాముల మ్యూజికల్ హిట్ గా ప్రభంజనం సృష్టించాయి.  ఈ పాట ప్రభావం ఇంకా జనాల్లో కనిపిస్తూనే ఉంది.  

 

టాలీవుడ్ లోకి రచయితగా కెరీర్ ప్రారంభించిన త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత తన సినిమాల్లో అన్నీ సమపాళ్లోలో చూడటం అలవాటు చేసుకున్నారు.. అందుకే ఆయన సినిమాలు హిట్ టాక్ వస్తున్నాయి.  అల వైకుంఠపురములో తర్వాత ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్దం చేసుకున్నారు.  ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ దర్శకత్వంలో నటించబోతున్నారట.  ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ‘అరవింద సమేత’ వచ్చిన విషయం తెలిసిందే.  

 

గతంలో ఎన్టీఆర్ నటించిన బృందావనం మూవీకి కూడా త్రివిక్రమ్ పనిచేశారు.   ఇటీవల  త్రివిక్రమ్ దర్శకత్వంలోవచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాకి తమన్ స్వరాలను సమకూర్చాడు. ఆ పాటలన్నీ కూడా చాలా పాప్యులర్ అయ్యాయి. సినిమా విజయంలో తమన్ సంగీతం ప్రధానమైన పాత్రను పోషించింది. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా కోసం తమన్ ని లైన్లో పెడుతున్నట్లు సమాచారం.  ఇక ఎన్టీఆర్ చేయనున్న సినిమా కూడా తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేసే అవకాశం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: