మన దేశంలో రాను రాను మానవత్వం మంట కలిసి పోవడంతో పాటు ముఖ్యంగా ఆడవారిపై అఘాయిత్యాలు మరింత ఘోరంగా పెరిగిపోతున్నాయి అనడానికి ఏడేళ్ల క్రితం ఢిల్లీలో ఎంతో ఘోరంగా జరిగిన నిర్భయ రేప్ ఉదంతం నిలువెత్తు సాక్ష్యం. పట్టపగలు ఒక అమ్మాయిపై నిర్ధాక్షిణ్యంగా, ఏ మాత్రం కనికరం లేకుండా నలుగురు యువకులు పైశాచికంగా అత్యాచారం చేసిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఏడేళ్ల ఏళ్ల క్రితం జరిగిన ఈ దుర్ఘటన నిందితులు మాత్రం, అప్పటి నుండి తమ తప్పు ఏమి లేదని, తాము నిందితులము కామని పలు విధాలుగా తప్పించుకునే ప్రయత్నాలు చేయసాగారు. 

 

అయితే వారి నక్క జిత్తులు పనిచేయకపోగా, వారు పాల్పడిన ఆ దారుణ ఘటనకు గాను వారికి ఇటీవల ఉరి శిక్ష విధించింది ఢిల్లీ ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు నేటి ఉదయం వారిని ఉరి తీయడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో హర్ష ద్వానాలు వెల్లివిరిసాయి. అయితే ఆ నలుగురు నీచుల ఊరితో ప్రజలు మాత్రమే కాక కొందరు ప్రముఖులు సైతం ఆనందం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. ఇకపోతే కాసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్భయ నిందితుల ఉరిపట్ల స్పందిస్తూ, మొత్తానికి ఇన్నేళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి చేకూరింది. 

 

ఎన్నో ఏళ్ల నుండి బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లికి కొంతైనా వారి శిక్ష ద్వారా ఆనందం కలుగుతుందని ఆశిస్తున్నాను. అలానే ఆ నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించిన మన న్యాయ వ్యవస్థకు, లాయర్లకు కృతజ్ఞతలు చెప్తూ మహేష్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసారు. అయితే కేవలం మహేష్ మాత్రమే కాక కార్తీ, రవితేజ, శ్రద్ధ కపూర్ వంటి మరికొందరు సినిమా ప్రముఖులు సైతం నిర్భయ నిందితులకు శిక్ష పడడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: