తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు వరుస హిట్లు వస్తే చాలు కొందరు నిర్మాతలు గా మారిపోవాలని భావిస్తూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారుతున్న రష్మిక మందన కూడా నిర్మాతగా మారే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె పట్టిందల్లా బంగారం అవుతున్న సంగతి అర్థమవుతుంది. దీనితోనే ఆమె నిర్మాతగా కూడా మారి చిన్న, చిన్న సినిమాలను నిర్మించే ప్రయత్నాలు చేస్తోంది.

 

భారీ బడ్జెట్ లో కాకుండా ఐదు కోట్ల లోపు అయిపోయే సినిమాలను నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈమె చిన్న హీరోల సినిమాలకు నిర్మాతగా మారేందుకు ఇప్పటికే కొందరు చిన్న హీరోలను సంప్రదించినట్లు సమాచారం. కథ నచ్చితే తాను సినిమా చేస్తానని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. తన సొంత రాష్ట్రం కర్ణాటక లో కూడా చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి ఈ అమ్మడు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త తరహా కథల కోసం తాను చూస్తున్నానని ఎవరిదగ్గరైనా మంచి కథలు ఉంటే తనకు మెయిల్ చేయాలని ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది.

 

ఆ ప్రకటనకు అర్థం తాను నిర్మాతగా మారాలి అనుకోవడమే అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు అదేవిధంగా నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు రష్మిక మందన దూకుడు పెంచిన కనబడుతోంది. ఆమెకు తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నాయి. త్వరలో ప్రారంభమయ్యే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో ఆమె హీరోయినగా నటిస్తోంది అంటూ టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: