అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమాని వరుస ఫ్లాపులతో కెరియర్ ని కొనసాగిస్తున్న డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు మరియు వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని మంచి కసి మీద ఉన్నారు హీరో అఖిల్. అక్కినేని ఫ్యామిలీ నుండి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాడు. ఇదే టైములో అక్కినేని అభిమానులు కూడా అఖిల్ నటిస్తున్న సినిమాల విషయంలో సెలెక్ట్ చేస్తున్న స్టోరీలు బట్టి కూడా నిరుత్సాహం చెందాడు. ముఖ్యంగా తండ్రి నాగార్జున ప్రోద్బలంతో గతంలో అక్కినేని అఖిల్ నటించిన సినిమాలన్నీ సెలెక్ట్ అయ్యి షూటింగ్ జరుపుకొని బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.

 

దీంతో అక్కినేని అభిమానులు నాగార్జున ఇన్వాల్వ్మెంట్ పై అప్పట్లో సీరియస్ అవ్వడం జరిగింది. తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఎడిటింగ్ లోపాలతోనే ఇంతకుముందు అఖిల్ సినిమాలన్నీ బోల్తా పడ్డాయని ఆయన భావించారేమో.. అందుకే సీన్ లోకి ఎంటరై ఉంటాడని టాలీవుడ్ లో హాట్ టాపిక్. అయితే ఇంతకు ముందు నాగార్జున దగ్గరుండి కేర్ తీసుకున్న సినిమాలు కూడా ప్లాప్ అయిన విషయం తెలిసిందే.

 

మరి ఈసారి ఏం జరగనుందో.. అని అనుకుంటున్నారు. కానీ నాగార్జున మాత్రం ఎడిటింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ తో ముందుకు రావడం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో నాగార్జున గారు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి సార్  దండం పెడతాము అంటూ అక్కినేని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అఖిల్ సినిమా విషయంలో మీరు ఇప్పటివరకు ఎంటర్ అయి సినిమాలను ప్లాప్ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ సినిమా విషయంలో అఖిల్ ని సొంతంగా నిర్ణయాలు తీసుకొనివ్వండి అంటూ దండం పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: