టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని తన ఊపు చూసి ఎవరైనా చెపేస్తారు. వరుసగా స్టార్ హీరోలతో నటిస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పుడు తన కి పోటీ ఉన్న హీరోయిన్ కూడా ఎవరూ లేరన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఇంత బిజీగా ఉన్న పూజా హెగ్డేకి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్ వచ్చి పడుతున్నాయి. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రూపుందుతున్న సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక్కడ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికి బాలీవుడ్ ఆఫర్స్ ని కాదనకుండా ఒడిసి పట్టుకుంటుంది. సల్మాన్ సినిమా తో పాటు మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం నటిస్తున్న బచ్చన్ పాండే సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. 

 

ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా మరో హీరోయిన్ గా పూజాని ఎంపిక చేశారట. ఇద్దరు హీరోయిన్లు ఉన్నఈ సినిమాలో కృతి సనన్ కంటే పూజా ఎక్కువ హైలైట్ గా ఉండబోతుందని బాలీవుడ్ మీడియా సమాచారం. ఈ పాత్ర గనక హిట్ అయితే బాలీవుడ్ లో పూజా సెటిల్ అయినట్టే. ఇటు టాలీవుడ్ లో నటించిన అరవింద సమేత, మహర్షి, అలవైకుంఠపురంలో సినిమాలలో తన అందాల ఆరబోతతో అభిమానుల ఆకట్టుకుంటున్న పూజా.. తక్కువ కాలంలోనే మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకొని ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఇదే స్టార్ డం ని దక్కించుకోవాలని చూస్తుంది. 

 

ఇక కరోనా ప్రభావంతో సినిమా రంగానికి చెందినవారంతా తమని తాము గృహనిర్బంధం చేసుకుంటున్నారు. రీసెంట్ గా పూజ కూడా అదే లిస్టులో చేరింది. కరోనా వ్యాప్తి తగ్గే వరకు ఇంట్లో నుండి బయటికి రానంటుంది. అయినా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి నిత్యం హాట్ హాట్ ఫోటోలతో టచ్ లో ఉంటూనే ఉంటుందట. మనకి సోషం మీడియా ఉంది కదా మనం అక్కడ కలుసుకుందాం అన్నట్టుగా ఫ్యాన్స్ కి ఇన్‌ఫర్మేషన్ ఇచ్చిందట. ఏదిఏమైనా పూజా మాత్రం సినిమా వాళ్ళని ఫ్యాన్స్ ని ఒదిలేలా లేదు కదా..! మొత్తానికి ఫ్యాన్ కోసం ఏమాత్రం తగ్గడం లేదుగా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: