'బాహుబలి' వంటి భారీ విజయం తర్వాత మళ్లీ అదే స్థాయిలో విజయం సాధించాలని దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా తెరకెక్కుతోంది. దేశ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి సినిమా కి మంచి క్రేజ్ ఉండటంతో అదే స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా సినిమా మొదలుపెట్టిన నాటినుండి ఏదో ఒక అడ్డంకి తో షూటింగ్ కి బ్రేక్ పడటం తో పాటుగా ఇద్దరి హీరోలకు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి షూటింగ్ చేస్తున్న టైమ్ లో దెబ్బలు తగలడంతో సినిమా దాదాపు కొన్ని నెలలు ఆగిపోయింది.

 

దీంతో ఈ ఏడాది జూన్ నెలలో వస్తుంది అనుకున్న సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది. తాజాగా ఈ సినిమాకి సరికొత్త కష్టం వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇదే టైమ్ లో అనగా అలియా భట్ మార్చి, ఏప్రిల్ నెలలో సినిమాకోసం డేట్స్ ఇచ్చింది.

 

అయితే ఈ కరోనా ఎఫెక్ట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియడం లేదు. దీంతో డేట్స్ సమస్య కారణంగా ఈ సినిమా నుంచి అలియా భట్ తప్పుకుందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. మరోపక్క సినిమా యూనిట్ మాత్రం అటువంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మొత్తంమీద చూసుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమా నుండి బయటకు వచ్చేయడానికి డిసైడ్ అయినట్లు ఇంకా రాజమౌళి మాత్రమే డిసైడ్ అవ్వాలని వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: