బుల్లితెర ఆదియెన్స్ ను నవ్వించే కామెడీ షో జబర్దస్త్ లో గొడవ జరగడం అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఎక్స్ ట్రా జబర్ద్సత్ షోలో భాస్కర్, అప్పారావు టీం స్కిట్ జరుగుతుండగా అప్పారావుని భాస్కర్ కర్రతో గత్తిగా కొడతాడు. అయితే స్కిట్ లో భాగంగా కొడుతున్నాడన్న భావనలో భాస్కర్ ఉండగా అప్పారావుకి అవి బాగా తగలడంతో ఫైర్ అయ్యాడు. స్కిట్ మధ్యలో ఆపేసి భాస్కర్ తో గొడవ పడ్డాడు. అప్పారావు షర్ట్ విప్పి ఒంటిమీద వాతలు చూపించాడు.

 

తాను కూడా ఒక టీం లీడర్ నే అని నన్ను ఇలా కొడతావా అంటూ గొడవపడి మరి స్కిట్ మధ్యలో స్టేజ్ దిగేశాడు అప్పారావు. భాస్కర్ టీం మాత్రమే కాదు ఈ ఊహించని సంఘటన ఎక్స్ జబర్దస్త్ జడ్జులను, యాంకర్ రష్మిని కూడా షాక్ అయ్యేలా చేసింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కొన్నిసార్లు కమెడియన్స్ బాధపడే అంశాలు జరిగినా అవి బయటకు రానివ్వరు కాని వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో భాస్కర్ తో అప్పారావు గొడవ చూపించి షాక్ ఇచ్చారు.

 

నిజంగానే గొడవ జరిగినట్టు అనిపిస్తుండగా ఒకవేళ స్కిట్ లో భాగంగా అలా ఏమన్నా చేశారా అన్న ఆలోచనలు వస్తునాయి. ఏది ఏమైనా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో భాస్కర్, అప్పారావు వచ్చే వారం ఎపిసోడ్ లో ఏం చేస్తారు అన్నది హాట్ న్యూస్ గా మారింది. అది నిజంగానే జరిగితే షోలో కంతెస్టంట్స్ మధ్య డిస్టన్స్ గురించి బయట వినిపించే వార్తలు నిజమే అని నమ్మొచ్చు. 

 

నాగబాబు బయటకు వెళ్లాక ఆయన ప్లేస్ లో జడ్జ్ గా నాగూర్ బాబు అదేనండి సింగర్ మనో గారు జడ్జ్ గా కొనసాగుతున్నారు. దాదాపు ఆయనే పర్మినెంట్ జడ్జ్ గా ఉంటారని తెలుస్తుంది. షోలో ఆయన పంచులు కూడా ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: