ఆర్ ఎక్స్100 చిత్రంతో ఓవర్నైట్ స్టార్ అయిపోయిన ముంబయి భామ పాయల్రాజ్పుత్. ఈ భామ మొదటి చిత్రంతోనే బోల్డ్ మరియు నెగిటివ్ క్యారెక్టర్లో చేసి విమర్శకుల సైతం ప్రశంసలందుకుంది. ఆ చిత్రంలో కార్తికేయ కంటే కూడా ఈమెకే ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నటించిన ఆర్ డి ఎక్స్ పర్వాలేదనిపించుకుంది. ఇక రెండు మూడు చిత్రాల్లో నటించింది కానీ ప్రతిదాంట్లో మోస్ట్లీ ఈ రకమైన పాత్రలనే ఎక్కువగా నటించింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమె కెరియర్ కాస్త డవున్ఫాల్ నడుస్తోంది. దానికి కారణం వెంకీమామలో వెంకటేష్ పక్కన నటించడమే ప్రధాన కారణమంటోంది. అందులో ఆంటీ పాత్రలో నటించానని దాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశాలు రావడం లేదని అంత సీనియర్ హీరో పక్కన నటించడంతో యువ హీరోలు అవకాశాలు ఇవ్వడంలేదని వాపోతుంది ఈ భామ.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమె నటించే చిత్రాలన్నీ కూడా దాదాపు ఫ్లాప్ బాట పట్టాయి. ఇటీవలె నటించిన రవితేజతో కలిసి డిస్కోరాజా చిత్రంలో నటించింది. అందులో ఓ మూగ పాత్రలో నటించింది. అయితే ఆ చిత్రంలో ఈ భామకు డైలాగులు లేకపోవడం కూడా కొంత వరకు మైనస్ అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కాని ఈమె మాత్రం కేవలం వెంకీమామలో ఆంటీ పాత్రలో చేయడం వల్ల అవకాశాలు తగ్గుముఖం పట్టాయి అంటోంది. దర్శకుడు నా పాత్ర గురించి మొదట్లో నాకు ఎలా చెప్పారో అలా తీయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో అవకాశాలు సన్నగిల్లాయంటోంది ఈ హాటీ.
ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అంతేకాక ఇక ముందు కొన్ని లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలె మీడియా ముఖంగా చెబుతోంది ఈ భామ. ఏది ఏమైనా ఓ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నప్పుడే ఆలోచించాలి ఇప్పుడు ఆలోచించి లాభం లేదంటున్నారు విశ్లేషకులు.