ప్రస్తుతం టాలీవుడ్లో చాలా మంది హీరోలు ఓవైపు సినిమాలతో బిజిగా ఉంటూనే.. ఇంకోవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు. మరియు తమ కుటుంబంలో ఆల్రెడీ నిర్మాణ సంస్థలున్నా కూడా సొంతగా నిర్మాణ సంస్థ పెట్టుకోవడానికే హీరోలు మొగ్గు చూపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇంట్లో రెండు ప్రొడక్షన్ హౌజ్ లు ఉన్నా.. జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ పేరిట సొంత బ్యానర్ ను స్థాపించి వరసగా తన సినిమాల్లో భాగస్వామిగా ఉంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, నితిన్, కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది హీరోలు అటు సినిమాల్లో నటిస్తూ.. ఇటు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్నారు.
ఇప్పుడు ఈ లిస్ట్లోకి నందమూరి మూడో తరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వచ్చి చేరాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఫీక్స్ అయ్యాడు ఎన్టీఆర్. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అంచనాలు కూడా బాగానే పెరిగాయి.
అయితే ఈ సినిమాకు స్లీపింగ్ పార్టనర్గా వ్యవహరించబోతున్నాడు ఎన్టీఆర్. తన అన్న కళ్యాణ్ రామ్ను నిర్మాతగా మార్చడంతో తను కూడా లాభాల్లో వాటాను తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ తర్వాత స్వయంగా ఓ నిర్మాణ సంస్థ పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే తన తండ్రి హరికృష్ణ పేరు మీద ‘ఎన్హెచ్కే’ అనే బ్యానర్ను రిజిస్ట్రర్ చేయించబోతున్నాడట. ఈ బ్యానర్లో సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లను కూడా నిర్మించాలని భావిస్తున్నారట. మరియు ఎన్టీఆర్ 31వ చిత్రం ఈ బ్యానర్లో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ బ్యానర్ వ్యవహారాలను ఎన్టీఆర్కు ఆప్తమిత్రుడు అయిన ఒక వ్యక్తి చూసుకుంటాడట.