ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అంటే వెంటనే గుర్తుకు వచ్చేది జగపతిబాబు.  అప్పట్లో శోభన్ బాబు తర్వాత ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా జగపతి బాబు ఎన్నో కుటుంబ తరహా చిత్రాలు వచ్చాయి. హీరోగా మంచి ఫామ్ లో ఉన్న జగతిపతి బాబు అప్పట్లో వరుస ఫెయిల్యూర్ చిత్రాల్లో నటించడంతో కెరీర్ కష్టాల్లో పడింది.  దాంతో ఇక ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పేద్దామనుకున్న పరిస్థితుల్లో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రంతో విలన్ అవతారం ఎత్తాడు.  ఈ చిత్రంలో బాలయ్య - జగపతిబాబు ఢీ అంటే ఢీ అన్నట్టుగా నటించారు.

 

ఈ చిత్రం జగపతిబాబు అదృష్టాన్ని పూర్తిగా మార్చింది.  వరుసగా తెలుగు, తమిళ, హిందీ, మళియాళ భాషల్లో విలన్ పాత్రలు వెంట వెంటనే వచ్చాయి. ప్రస్తుతం జగపతిబాబు విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.  అయితే ఆయన నటించిన ఈ చిత్రాలు సైతం మంచి సక్సెస్ అందుకుంటున్నాయి.  ఇప్పటి వరకూ వెండితెర ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు. జగపతి బాబు బుల్లితెర మీద నిర్వహించే ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా మారబోతున్నారట.  ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, నాని, రానా, రోజా  బుల్లితెరపై యాంకర్ల అవతారం ఎత్తిన విషయం తెలిసిందే.

 

తాజాగా వీరి బాటలోనే జగపతి బాబు కూడా బుల్లితెరపై తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారట. జెమినీ టీవీలో ఓ గేమ్ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ఆయ‌న అంగీకరించినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలు తెలియనున్నాయి. ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉంటున్నా ఈ మద్య కొంత మంది తారలు బుల్లితెరపై కన్నెస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగపతి బాబు సైతం తన సహనటుల బాటలో నడిచేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: