తమిళ్ హీరోలు ఇద్దరు మంచి హిట్లు దక్కించుకున్న వారే. కేవలం తమిళ్ సినిమాలలో మాత్రమే కాక ఇటు తెలుగులో కూడా అనేక సినిమాలలో నటించారు. పరిచయం ఇవ్వడం అనవసరం. అందరికి వీరు తెలిసిన హీరోలే. గజినీ తో ఎంతగానో ప్రసిద్ధి చెందాడు సూర్య. అనేక అవార్డులు కూడా దక్కించుకున్నాడు ఈ హీరో.

 

సింగం సినిమాతో చాలా మంచి హిట్ ఇచ్చి తెలుగు, తమిళ్ లో కూడా. అయితే దేవా, ఆరు, వీడోక్కడే, రక్త చరిత్ర, సెవెంత్ సెన్స్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, వీడోక్కడే, ఘటికుడు ఇలా అనేక సినిమాలలో నటించాడు సూర్య. అయితే సూర్య కొత్త సినిమా కార్తీ తో కలిసి చేయనున్నాడట. 

 

మరో వైపు కాథీ ఆవారా, ఊపిరి, ఖాకీ, ఖైదీ ఇలా పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యి మెప్పించాడు. వీటితో కార్తీ కి మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్ కలిసి సరి కొత్త చిత్రం లో నటించనున్నారన్న వార్తలు హల చల్ అవుతున్నాయి. వివరాలు చూస్తుంటే ఈ ఇద్దరు తెరపై కనపడబోతున్నారు అన్నది స్పష్టమే.

 

అయితే ఈ చిత్రం మలయాళం లో హిట్ అయిన అయ్యపనం కోసియమ్ చిత్రానికి రీమేక్ అట. ఈ చిత్రం లో పృథ్వి, బిజూ పాత్రలు సూర్య , కార్తీ చేస్తున్నారట. సూర్య కార్తీ కలిసి ఒకే తెరపై చూడడం ఫాన్స్ కి నిజమ్గా ఆనందమే. ఎప్పటి నుండో చూడాలనుకుంటున్న వారి ఇద్దరి అభిమానులకి పండగే. కానీ కొంత కాలం ఆగక తప్పదు. అయితే ఇప్పటికే సూర్య మరో సినిమాలో షూటింగ్ లో ఉన్నాడు. ఆకాశమే నీ హద్దురా సినిమాలో నటిస్తున్నాడు. అలానే హీరో కార్తిక్ కూడా పొన్నియార్ సెల్వం చిత్రాలలో నటిస్తూ బాగా బిజీ అయ్యాడు. . 

మరింత సమాచారం తెలుసుకోండి: