కరోనా వైరస్ ప్రభావం ఆఖరికి టాలీవుడ్ సినీ పరిశ్రమ పై కూడా పడింది. మహమ్మారి కరోనా భయంతో ఇప్పటికే బుల్లితెర, వెండితెర షూటింగ్ కార్యక్రమాలు మూసివేయబడ్డాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కూడా ఆగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఆచార్య సినిమా చిత్రీకరణ కూడా మార్చి 31వ తేదీ వరకు నిలిపివేయబడింది. మరోవైపు అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా తన చిత్రం యొక్క కేరళ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకుని ఇంటికే పరిమితమయ్యాడు.





సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుండి అల్లు అర్జున్ తన చిత్రాల గురించే ఎక్కువగా సమయం కేటాయించాడు కానీ తన బంధువుల గురించి అంతగా సమయం వెచ్చించలేదు. కానీ కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడు తను తన కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు చాలా టైం దొరికింది. స్వీయ నిర్బంధాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్న అల్లు అర్జున్ తన నానమ్మ తో సహా ఇతర కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతున్నాడు. తను ఎంజాయ్ చేస్తున్న విషయాలను నెట్టింట షేర్ చేసి అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. తాజాగా తాను హాస్యనటుడు అల్లు రామలింగయ్య భార్య అనగా తన నానమ్మ తో కలిసి దిగిన ఓ ఫోటోని ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.




ఆ ఫోటోలో నానమ్మ అల్లుఅర్జున్ ని ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తుంది. ఐతే అల్లుఅర్జున్ ఈ ఫోటోకి... ' క్వారంటైన్ లైఫ్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాను' అని ఓ క్యాప్షన్ ని జత చేశాడు. అరుదైన ఫోటో అనిపించగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక సినిమాకైనా, సీరియల్ కైన ప్రోగ్రాం కైనా ఒప్పుకుంటే సెలవలు అనేవి అస్సలు ఏమి లేకపోవడంతో ఆయా నటులు నిర్విరామంగా పని చేయలేక తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. కానీ కరోనా దయవలన వారికి విశ్రాంతి దొరికింది. దాంతో ఈ విశ్రాంతి సమయాన్ని ఆనందకరమైన క్షణాలు గా మార్చేసుకుంటున్నారు సెలబ్రెటీలు.

మరింత సమాచారం తెలుసుకోండి: