బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ లపై కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అలియా బర్త్ డే పార్టీలో రణబీర్ కనిపించకపోవటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. దీంతో నిజంగా అలియా ,రణబీర్ లు విడిపోతున్నారని భావించారు ఫ్యాన్స్.
అయితే రూమర్స్ కు చెక్ పెట్టింది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ డిస్టాన్సింగ్ గురించి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది అలియా. సూర్యాస్తమాన్ని చూస్తున్న తన ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది అలియా. ఈ ఫోటోతోనే బ్రేకప్ రూమర్లకు చెక్ పెట్టేసింది.
ఫోటోతో పాటు `ఇంట్లోనే ఉండండి, సూర్యాస్తమయాన్ని చూడండి. ఈ ఫోటో తీసిందినా ఎప్పటికీ నాకు నచ్చిన ఫోటోగ్రాఫర్ ఆర్ కే (రణబీర్ కపూర్)` అంటూ కామెంట్ చేసింది. దీంతో ఐసోలేషన్ లోనూ వీరిద్దరూ కలిసే ఉన్నారని ఫ్యాన్స్ అర్ధమయ్యేలా చెప్పకనే చెప్పింది అలియా. దీంతో ఇక బాలీవుడ్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న బ్రేకప్ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది.