ప్రపంచాన్ని భయకంపితులను చేస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందేకు ఇప్పుడు భారతీయులు అందరూ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం రేపు ‘జనతా కర్ఫ్యూ’ చేయాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీన్ని ప్రముఖ సెలబ్రెటీలు సైతం ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాన్, మహేష్ బాబు ఇతర నటులు సోషల్ మాద్యమాల ద్వారా తమ సందేశాలు పంపారు. ఇక బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ సైతం పీఎం మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయానికి అందరూ జయహో అంటున్నారు. కరోనా వ్యాప్తిపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి స్పందించారు.
ఇప్పటికే తనను చూడటానికి అభిమానులు రావొద్దని.. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని.. మీరంతా హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తాను సూపర్ మ్యాన్ గెటప్లో తీసుకున్న ఓ ఫొటోను ఆయన తాజాగా పోస్ట్ చేశారు. చాలా సంవత్సరాల క్రితం తన తయుడు అబిషేక్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ సూపర్ మాన్ డ్రెస్ వేసుకున్నానని.. ఇది సూపర్ మ్యాన్ థీమ్ డ్రెస్ అని పేర్కొన్నారు. తాను నిజ జీవితంలో సూపర్ మ్యాన్లా మారగలిగితే భయంకరమైన కరోనాను నాశనం చేస్తానని తెలిపారు. కరోనా వల్ల చిన్నా.. పెద్ద అందరూ భయపడిపోతు న్నారని.. దీనికి ఇప్పటి వరకు యాంటీబయటిక్ కనుగొనలేదని.. మనం జాగ్రత్తలు పాటించడం వల్లే దీన్ని రూపు మాపగలమని ఆయన అన్నారు.
తనకు ఏమైనా మహిమలు దేవుడు ప్రసాదిస్తే ఇప్పుడు కరోనానూ పూర్తిగా రూపు మాపుతానని అన్నారు. కరోనా గురించి భయపడకండి.. మనం శుభ్రత పాటిస్తే కరోనాను అరికట్టగలం అని అన్నారు. కాగా, రేపటి జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ఆయన ప్రజలకు సూచించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో షూటింగ్లు వాయిదా పడడంతో నటులందరూ ఇళ్లలోనే ఉంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ కూర్చుంటున్నారు.
T 3476 - A fancy dress birthday party for abhishek in his very early years .. dress theme 'SUPERMAN' ..
— amitabh bachchan (@SrBachchan) March 20, 2020
काश की वास्तव में हम superman बन कर इस सभयंकर महामारी corona virus को सदा के लिए नष्ट कर सकते !! pic.twitter.com/DvT90WYs6f