స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రీసెంట్ గా ఆహా యాప్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ యాప్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం లో ఉన్నారు అల్లు అరవింద్. ఆల్రెడీ ఈ యాప్ లో క్రిష్ నిర్మించిన మస్తీ వెబ్ సీరీస్ రిలీజ్ చేశారు. ఇదేకాకుండా మరో రెండు వెబ్ సీరీస్ లు వస్తున్నాయి. అందులో ఒకటి రన్ అనే టైటిల్ తో వస్తుంది. 

 

ఈ వెబ్ సీరీస్ ని క్రిష్ అల్లు అరవింద్ కలిసి నిర్మించారట. ఇదే కాదు క్రిష్ తో వరుసగా మెగా వవెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట అల్లు అరవింద్. ఆహా యాప్ కు క్రేజ్ వచ్చే వరకు క్రిష్ తో అల్లు అరవింద్ వరుసగా వెబ్ సీరీస్ లు చేయాలని ఫిక్స్ అయ్యాడట. క్రిష్ కు కథల ఎంపికలో మంచి పట్టు ఉంది. ఇప్పటికే నిర్మాతగా సీరియల్స్, వెబ్ సీరీస్ లు చేసి ఉన్నాడు. అందుకే క్రిష్ మీద మెగా ప్రొడ్యూసర్ నమ్మకం పెట్టుకున్నాడట.

 

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా వస్తుందట. క్రిష్ మార్క్ డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ హీరో సినిమా అనగానే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. క్రిష్ ఒక పక్క సినిమాలు డైరెక్ట్ చేస్తూ వెబ్ సీరీస్ లు నిర్మిస్తున్నాడు. వెబ్ సీరీస్ లు క్లిక్ అయితే నిర్మాతగా క్రిష్ కు ఇక తిరుగులేదు అన్నట్టే. క్రిష్ సినిమా ల్లో కూడా నిర్మాణ భాగస్వామ్యంగా ఉంటాడని తెలిసిందే. ఎక్కడ రాబట్టింది అక్కడే ఖర్చు పెట్టాలని క్రిష్ దర్శక నిర్మాతగా ఫుల్ బిజీ అవుతున్నాడు. చేస్తున్న ప్రాజెక్టులు సక్సెస్ అయితే క్రిష్ కూడా ఫుల్ టైం నిర్మాతగా మారినట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: