టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి సినిమా అనగానే ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇక ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం కొంతమంది నటీ నటులు అదృష్టంగా కూడా భావిస్తారని టాలీవుడ్ వర్గాలు అంటుంటాయి. చిరంజీవి సినిమా లో అవకాశం వచ్చినా సరే దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది ఒక యాంకర్. ఆ యాంకర్ ఎవరో కాదు జబర్దస్త్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ భరద్వాజ్.

 

ఇటీవల ఆమెను ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ చిరంజీవి సినిమా లో నటించేందుకు గాను అడిగి ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను ఆయన ఆమె కు వివరించినట్లు సమాచారం. అయితే చిరంజీవి సినిమా కాబట్టి భారీగా పారితోషికం తీసుకోవాలని ఆమె అని అడిగినట్లు సమాచారం. దీనితో చిత్ర దర్శకుడు నిర్మాత ఆమెను పక్కన పెట్టారట. అదేవిధంగా నితిన్ సినిమాలో కూడా ఆమెకు కీలక పాత్ర చేసే అవకాశం వచ్చినా సరే దాన్ని వాడుకో లేకపోయిందని, అనవసరంగా ఎక్కువ డిమాండ్ చేయడం తో నిర్మాతలు ఆమెను వద్దని భావిస్తున్నట్టు ఇప్పుడు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

ప్రస్తుతం ఆమె యాంకరింగ్ లో దూసుకుపోతుంది. ఈ తరుణంలోనే వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడం తో ఎందుకు వాటిని వదులుకోవాలి అని భావిస్తూ సినిమాలు చేయాలని చూస్తోంది. అయితే రెమ్యునరేషన్ విషయంలో ఇష్టం వచ్చినట్టు అడగడంతో ఇక ఆమెను వద్దని భావిస్తున్నారట నిర్మాతలు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నిలబడుతున్న అనసూయ ఈ విధంగా డిమాండ్ చేయడంతో టాలీవుడ్ లో కొందరు సీనియర్ నటులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సినిమాలలో రాణించాలి అంటే కచ్చితంగా పారితోషికం తగ్గించాల్సిన అవసరం ఉంది. అలా తగ్గించకపోతే మాత్రం ఆమెను దూరం పెట్టడం ఖాయమని అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఆమె సినిమాల్లో ఎప్పుడు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: