సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని గా అమరావతి నే ప్రకటించినప్పుడు తెలుగు సినీ పరిశ్రమ లో చాలామంది పెద్దలు అక్కడ భూములు కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని భావించి చిన్న హీరోలు పెద్ద హీరోలు వాళ్ళు వీళ్లు అనే తేడా లేకుండా రాజధాని ప్రాంతంలో ఎక్కువగా భూములు కొనుగోలు చేశారు. అక్కడ హీరోయిన్  భూములు కొనుగోలు చేయడం గమనార్హం.

 

 ప్రధానంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క అక్కడ 12 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సమీపంలో ఆమె భూములు 2016 లో కొనుగోలు చేసిందట. తనకు తెలిసిన ఒక సినీ పెద్దల సహకారం తో. అయితే ఇప్పుడు రాజధాని మారుతున్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా అమ్మాలి అనేది మదన పడుతోందని వార్తలు వచ్చేసాయి. తాజాగా ఒక మంత్రి ఆమెకు సహకారం అందించినట్లు సమాచారం. రాజధాని లో ఉన్న 12 ఎకరాల్లో 8 ఎకరాలను ఆమె రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కి విక్రయించింది అని సమాచారం. 

 

మంత్రి గారు ఆమెకు మంచి ధర ఇప్పించటం జరిగింది అంటున్నారు. దీంతో మరో నాలుగు ఎకరాలు కూడా త్వరగా అమ్మేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ చేస్తే మంచిది అని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఆమె మిగిలిన భూమి వెలగపూడి సమీపంలో ఉందని అంటున్నారు. వెలగపూడి సచివాలయం సమీపంలోనే ఆమె భూమి ఉందట. ఇక మరి కొంత మంది స్టార్ హీరోలు కూడా ఇప్పుడు ఆ భూములను అమ్ముకోవడానికి రెడీ అవుతున్నారు. తనకు సదరు మంత్రిగారు సహకారం అందించడంతో అనుష్క ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పిందట. అయితే దీని వెనుక ఒక స్టార్ హీరో రికమండేషన్ ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: