టాలీవుడ్ లో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా ద్వారా నితిన్ విజయాన్ని అందుకున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా జనవరి నెలలో విడుదలై మంచి సక్సెస్ ని సాధించింది. దీనితో ఇప్పుడు నితిన్ మంచి ఊపు మీదున్నాడు. వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులు నితిన్ వద్దకు తీసుకెళ్లి సినిమా చేస్తామని అడగగా నితిన్ మూడు సినిమాలను లైన్లో పెట్టినట్టు సమాచారం.

 

 వాటిలో ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత లేదు. అయితే నితిన్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. కల్యాణ్ రామ్ కూడా ఆ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాల కథనం. ఈ సినిమా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆగిందని త్వరలోనే షూటింగ్ ను కూడా మొదలు పెట్టే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

 ఈ సినిమాలో హీరోయిన్ గా  రష్మిక మందన నే కనిపించే అవకాశాలు కనబడుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. కల్యాణ్  రామ్ ప్రస్తుతం తాను నిర్మాతగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: