టాలీవుడ్ లో అను ఇమ్మాన్యుయేల్ ఇచ్చిన ఎంట్రీ చూసి అందరూ చాలాకాలం ఇండస్ట్రీలో సక్సస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుందనుకున్నారు. అందుకు కారణం  2016లో వచ్చిన 'యాక్షన్ హీరో బిజు' అనే మలయాళ సినిమాతో మాలీవుడ్ లోకి.. అదే సంవత్సరం నాని హీరోగా విరించి వర్మ దర్శత్వంలో తెరకెక్కిన 'మజ్ను' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. నాని మజ్ను సినిమాలో చక్కగా తెలుగమ్మాయిలా కనిపించి కవ్వించింది. తను ఇచ్చిన క్యూట్ ఎక్సప్రెషన్స్ తో కుర్రాళ్ళకి డ్రీం గాళ్ గా మారిపోయింది. అందుకే మొదటి సినిమాకే అను ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

 

సినిమా తర్వాత వరుసగా రాజ్ తరుణ్ తో కిట్టు ఉన్నాడు జాగ్రత్త, గోపి చంద్ తో ఆక్సిజన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య,
అక్కినెని నాగ చైతన్య తో శైలజ రెడ్డి అల్లుడు సినిమాలు చేసింది. వరుసగా ఇన్ని సినిమాలు చేసినా సరైన హిట్ దక్కలేదు. దాంతో తెలుగులో అను ని మేకర్స్ దూరం పెట్టారు. అసలే మన వాళ్ళకి లక్కీ హీరోయిన్ అన్న సెంటిమెంట్ బాగా ఉంటుంది. వరుసగా ఫ్లాస్ వచ్చిన హీరోయిన్ ని ఎంత మాత్రం ఎంకరేజ్ చేయరన్న టాక్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా 'నమ్మ వీట్టు పిళ్ళై' సినిమాతో తమిళంలో ఒక సినిమా చేసినప్పటికి ఆ సినిమా కూడా అను కి చేదు అనుభవాన్నే ఇచ్చింది.

 

దీంతో ప్రస్తుతం అను ఖాళీగా ఉంది. అయితే తనక్సం ఫ్యాన్స్ మాత్రం సినిమాలు చేయడం లేదని ఫీలవుతున్నారట. అందుకే అను సినిమాలు చేయకపోయిన్న తన అడ్రస్ చెప్పి ఫ్యాన్స్ ని అక్కడ నిత్యం కలుస్తానై హింట్ ఇచ్చిందట. అవును నన్ను ఎలాగో సినిమాలలో చూడలేకపోతున్నారు కాబట్టి మీకోసం సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్ లో ఉంటానని చెప్పింది. దాంతో అను ఫ్యాన్స్ తనతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ తన హాట్ ఫొటోలకి హాట్ కామెంట్స్ ఇస్తున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: