సినిమారంగంలో అన్నదమ్ములు సూర్య మరియు కార్తీ పేర్లు తెలియని వారు ఎవరూ ఉండరు. ఒక్క కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వీరిద్దరికీ మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇద్దరు నటించే ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదలయ్యేలా చూసుకుంటారు. 'శివ పుత్రుడు' సినిమా తో ప్రేక్షకులను పలకరించిన సూర్య ఆ తర్వాత 'గజిని' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుని, అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుని అప్పటి నుండి తాను నటించే ప్రతి సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇదే తరుణంలో కార్తీ కూడా తన సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తూ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.

 

దీంతో వీళ్లు ఎప్పటి నుంచో తెలుగులో నటిస్తారని  వార్తలు వస్తున్నా గాని ఇప్పటివరకు కార్య రూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్త వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవల విడుదలై మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న 'అయ్యప్పనం కోసియం' చిత్రానికి రీమేక్ అని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కతిరేషన్ నిర్మిస్తున్నారంట. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ - బిజూ మీనన్ పోషించిన పాత్రలను తమిళ్ లో సూర్య కార్తీలు చేస్తున్నారంట.

 

ఈ వార్తే నిజమైతే ఎప్పటినుండో ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడలనుకుంటున్న అభిమానులకు శుభవార్త అవుతుంది. అయితే అధికారికంగా ఈ సినిమా గురించి కన్ఫామ్ వార్త ఇంకా వెలువడలేదు. ఈ సినిమా ఖచ్చితంగా సెట్స్ పైకి వెళ్తే నిజంగా తమిళ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. జిల్లా ఉండగా ప్రస్తుతం సూర్య డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలో నటిస్తుండగా కార్తీ పొన్నియన్ సెల్వన్' చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: