ప్రస్తుతం కరోనా భయంతో ప్రజలంతా ఇంటికే పరిమిత మవుతున్నారు. సెలబ్రిటీలు కూడా తమ ఫాలోవర్స్ను అభిమానులను ఇంటికే పరిమిత మవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు సినీ తారలు సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉన్న వాళ్ల క్వాలిటీ టైం ను ఎలా వినియోగించుకుంటున్నారో చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ అంతా తమ వర్క్ అవుట్ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా శ్రీదేవి కూతురు కూడా ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ఖాళీ సమయంలో కలర్ ఫుల్ పెయింటింగ్స్ వేస్తూ టైం పాస్ చేస్తోంది జాన్వీ. కలర్ ఫుల్ షర్ట్ లో స్వయంగా తాను వేసిన కొన్ని పెయింటింగ్స్ ను పక్కన పెట్టుకొని దిగిన ఫోటోనూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది జాన్వీ. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల సల్మాన్ కూడా తాను పెయింటింగ్స్ వేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. శ్రీదేవి వారసులిగా దడక్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జాన్వీ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. తరువాత ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించిన జాన్వీ ఇటీవల అంగ్రేజీ మీడియం సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న గుంజన్ సక్సెనా, రూహీ అఫ్జానా, దోస్తానా 2 సినిమాల్లో నటిస్తోంది జాన్వీ.
View this post on InstagramSelf isolation productivity 🌈🖼🍍 #ilovepineapple #stayhomestaysafe #fightcorona