అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. మన్మధుడూ 2 వంటి డిజాస్టర్ తర్వాత నాగార్జున చేస్తున్న ఈ చిత్రం మీద బాగా ఆశలు పెట్టుకున్నాడు. ఎన్ ఐ ఏ అధికారిగా కనిపించనున్న నాగార్జున వైల్డ్ డాగ్ తో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్నఈ చిత్రాన్ని అన్నీ కుదిరితే మే నెలలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

 

అయితే కరోనా కారణంగా అన్ని చిత్రాలు వాటి విడుదలను ఆపేశాయి. అలా ఆపేసిన వాటిలో చైతన్య లవ్ స్టోరీ కూడా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేస్తారని అంటున్నారు. ఇక అఖిల్ చిత్రమైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్ర షూటింగ్ కూడా చివరై దశకు చేరుకుంది. మిగిలిన కొంతభాగాన్ని కరోనా పూర్తిగా తొలగిపోయిన తర్వాత షూట్ చేయనున్నారు.

 


అయితే ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు కూడా ఒకే స్టేజ్ లో ఉన్నాయి. ఒక విధంగా ఆలోచిస్తే ఈ మూడు చిత్రాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ మూడు చిత్రాల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వీరందరికీ ఖచ్చితంగా హిట్ కావాలి. మన్మధుడు 2 తెచ్చిన బ్యాడ్ నేమ్ పోవాలంటే వైల్డ్ డాగ్ ఆడాల్సిందే. అలాగే నాగ చైతన్య మజిలీ ద్వారా హిట్ సాధించినప్పటికీ అది కాస్తా సమంత ఖాతాలో పడిపోయింది.

 


కాబట్టి సోలోగా అతడు హిట్ కొట్టి నిరూపించుకోవాలి. ఇక ఇప్పటి వరకు హిట్ ఎరుగని అఖిల్ కి కంపల్సరీగా విజయం కావాలి. మరి వీరందరూ ఒకే సారి తలపడితే విజయం ఎవరిని వరించనుందో చూడాలి. ప్రస్తుతానికి అనధికార వార్తల ప్రకారం మే నెలలో ఈ సినిమాలు ప్రేక్షకులు ముందుకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: