వివాదాలకు దూరంగా ఉండే మహేష్ అంటే ఇండస్ట్రీ ప్రముఖులు అంతా ఇష్టపడతారు. ముఖ్యంగా నాగార్జునకు మహేష్ అంటే బాగా ఇష్టం. ఈ సాన్నిహిత్యంతోనే అఖిల్ మొదటి సినిమాఆడియో ఫంక్షన్ కు మహేష్ ను అతిధిగా పిలిచి నాగ్ అఖిల్ ను మహేష్ ప్రమోట్ చేసేలా చేసాడు. దీనికితోడు నాగార్జునకు సూపర్ స్టార్ కృష్ణ అన్నా చాల గౌరవం. 


అలాంటి నాగార్జున ఇప్పుడు మహేష్ పేరు చెపితే తీవ్ర అసహనంలోకి వెళ్ళిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం మహేష్ వల్ల తన కొడుకు నాగచైతన్యకు నష్టం జరిగింది అంటూ నాగార్జున తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లు లేక హీరోలు అంతా ఖాళీగా ఉంటే నాగార్జున మటుకు ఇలా అసహనం తో రగిలిపోతు ఉండటం చాల మందికి షాకింగ్ గా ఉంది.


నాగ్ కు ఇలా కోపం రావడానికి గల కారణం దర్శకుడు పరుశు రామ్ కథను మహేష్ ఓకె చేయడం అని అంటున్నారు. పరుశు రామ్ నాగచైతన్యాల కాంబినేషన్ లో ఒక మూవీ అధికారికంగా ప్రకటింపబడింది అని తెలిసినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా మహేష్ పరుశు రామ్ కు తన డేట్స్ ఎలా ఇచ్చాడు అంటూ నాగ్ మండి పడుతున్నట్లు టాక్. అంతేకాదు కనీసం ఈ విషయాన్ని పరుశు రామ్ కాని మహేష్ కానీ మర్యాదకు అయినా చైతన్యకు చెప్పకపోవడం నాగ్ కోపానికి గల కారణం అని అంటున్నారు. 


దీనితో నాగార్జున ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పరుశు రామ్ పై ఫిలిం చాంబర్ లో కంప్లైంట్ ఇమ్మని నాగచైతన్య పరుశు రామ్ మూవీ ప్రాజెక్ట్ ను తీయడానికి ప్రయత్నించిన నిర్మాతలకు సలహా ఇచ్చినట్లు టాక్. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ మహేష్ దృష్టి వరకు రావడంతో ఈ వ్యవహారాన్ని సానుకూలంగా పరిష్కరించడానికి స్వయంగా మహేష్ రంగంలోకి దిగాడు అంటూ ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: