ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనే పాట చాలా మందికి గుర్తే. పాటే కాదు పాడినవారెవరో కూడా మనందరికీ తెలుసు. ఆ ఒక్కపాటతో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది సింగర్ సునీత. అయితే ప్రస్తుతం ఈమెకి ఓ చిక్కొచ్చి పడింది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. మనదేశంలో ప్రవేశించిన ఈ కరోనా వైరస్ ధనిక, పేద అనే తేడా లేకుండా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు.

 


కరోనా బారిన ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సెలెబ్రిటీస్ పడ్డారు. హాలీవుడ్ హీరో టామ్ హ్యాంక్స్ భార్యకి కూడా కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీల్లో ఒకరైనా కనికా కపూర్ కి కరోనా సోకింది. కనికా కపూర్ బాలీవుడ్ సింగర్. బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ పాడే ఈమె గురించి అందరికీ తెలుసు. తాజగా ఈమెకి కరోనా సోకిందన్న విషయాన్ని వైద్యులు నిర్ధారించారు.

 


ఈ వార్తని చెబుదామన్న ఉద్దేశ్యంతో యూట్యూబ్ ఛానెల్స్ కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. పేరు మోసిన సింగర్ కి కరోనా వైరస్ సొకిందనే హెడ్ లైన్ తో థంబ్ నేల్ ని క్రియేట్ చేసి ఒక ఫోటోని ఆడ్ చేశారు. ఆ ఫోటో ఫేస్ ని బ్లర్ చేసినప్పటికీ చూస్తే ఆ సింగర్ సునీత అని ఇట్టే తెలిసిపోతుంది. సింగర్ అని పేరు చెప్పి సునీతే కావొచ్చన్న ఆసక్తి క్రియేట్ చేయడానికే ఇలా చేసారని తెలుస్తుంది.

 


ఈ విషయం తెలుసుకున్న సునీత తను బానే ఉన్నానని, ఇలాంటివి మరోసారి చేయొద్దని, ఈ విషయమై హెల్ప్ చేయాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ని విన్నవించుకుంది. ఇలాంటివి మరోసారి చెయొద్దని హెచ్చరించింది కూడా. కరోనా సమయంలో అసత్య ప్రచారాలు ఎక్కువ ఇబ్బంది పెడతాయని తెలుసుకోవాలని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: