బాలీవుడ్‌ మూవీ ఫగ్లీతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ కియారా అద్వానీ. తరువాత ధోని సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ తరువాత లస్ట్ స్టోరీస్‌ వెబ్‌ సిరీస్‌ లో చేసిన బోల్డ్ క్యారెక్టర్ తో ఒక్కసారిగా హాట్ టాపిక్‌ గా మారింది. అదే సమయంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది. కానీ రెండో ప్రయత్నంగా చేసిన వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్‌ కావటంతో ఈ భామకు టాలీవుడ్‌ లో అవకాశాలు తగ్గిపోయాయి.

 

అయితే బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేస్తోంది ఈ భామ. అర్జున్ రెడ్డి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్‌ సింగ్‌తో సూపర్ హిట్‌ అందుకున్న కియారా, గుడ్‌ న్యూజ్‌ సినిమాలోనూ నటించింది. అంగ్రేజీ మీడియం సినిమాలో గెస్ట్ రోల్‌ లో నటించిన ఈ భామ ప్రస్తుతం లక్ష్మీ బాంబ్, ఇందూకి జవానీ, షేర్‌ షా, భూల్‌ భులయ్యా సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఈ భామ కాస్మోపాలిటన్ అనే మ్యాగెజైన్ కోసం ఓ ఫోటో షూట్ చేసింది.

 

ఇటీవల డబూ రత్నాని ఫోటో షూట్ కోసం టాప్‌ లెస్ గా నటించిన ఈ భామ. తాజా ఫోటో షూట్‌ లో షర్ట్ బటన్స్‌ అన్నీ తీసేసి హాట్ హాట్ ఫోజులిచ్చింది. ఆ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ ను తన సోషల్ మీడియా పేజ్‌ లో షేర్‌ చేసిన కియారా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అభిమానులకు ఓ సందేశాన్ని కూడా ఇచ్చింది. అందరూ ఇళ్ల దగ్గరే ఉండండి. జాగ్రత్తగా ఉండండి అంటూ తన వంతుగా ఓ మెసేజ్‌ ఇచ్చింది కియారా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Stay Classy, stay chic, stay cosmopolitan AT home ❤️ stay safe!#socialdistancing101 📸 @taras84

A post shared by KIARA (@kiaraaliaadvani) on

మరింత సమాచారం తెలుసుకోండి: