ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీలో చేసిన బయోపిక్ లో హవా నడుస్తున్న విషయం తెలిసిందే. బయోపిక్ లను  తెరకెక్కించడం మంచి సక్సెస్ అందుకోవడం ఇలా చాలామంది చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా రంగాల్లో రాణించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ప్రముఖుల బయోపిక్ లు  తెరకెక్కించి ప్రేక్షకుల ముందుంచారు దర్శక నిర్మాతలు. ప్రేక్షకులు కూడా బయోపిక్ లను బాగా ఆదరిస్తున్న డంతో...  ఎక్కువగా బయోపిక్ లు  తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక తెలుగులో కూడా బయోపిక్స్ కొత్తేమీ కాదు. మొదట మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కించిన తర్వాత ఇది సంచలన విజయం సాధించగానే.. వరుసగా బయోపిక్ తెరకెక్కించేందుకు సిద్ధ మారిపోయారు దర్శకనిర్మాతలు. ఆ తర్వాత ఎన్టీఆర్,  కెసిఆర్,  వైయస్సార్ ఇలా చాలా మంది రాజకీయ ప్రముఖుల బయోపిక్ లు  తెరకెక్కించారు. 

 


 ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మరో బయోపిక్ తెరకెక్కించబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఈ బయోపిక్ లో  చారిత్రాత్మకమైన రుద్రమదేవి,  సైరా నరసింహారెడ్డి లాంటి బయోపిక్స్ కిందికి వస్తాయి. ఇలాంటి మరో బయోపిక్ తెరకెక్కించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమలో రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బయోపిక్ లో ఎవరు నటించబోతున్నారో  తెలుసా... రుద్రమదేవి లాంటి పాత్రల్లో  రాజసంతో నటించి అద్భుతంగా ప్రశంసలు అందుకున్న టాలీవుడ్ క్వీన్ అనుష్క నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 


 ఈ మధ్య కాలంలో అనుష్క ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్న విషయం తెలిసిందే. అరుంధతి రుద్రమదేవి భాగమతి పంచాక్షరి ఇలా చెప్పుకుంటూ పోతే లేడి ఓరియెంటెడ్ సినిమాలు ఈ అమ్మడు బాగానే చేస్తుంది. ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో  వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకోవడమే కాదు సంచలన విజయాలను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తో అనుష్కసినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సింగర్ మహిళా హక్కుల పోరాట యోధురాలు బెంగళూర్ నాగరత్నమ్మ బయోపిక్ తెరకెక్కించాలని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆలోచిస్తున్నారట. ఇక ఈ పాత్రలో స్వీటీ ఐతేనే బాగుంటుంది అని ఆయన అనుకుంటున్నారట. దీనిపై అఫీషియల్ ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: