మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆచార్య. ఈ టైటిల్ ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ని వాయిదా వేసారు. త్వరలోనే ఈ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎవరిని ప్రకటిస్తారు అనేది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు త్రిష ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరిగింది. 

 

అయితే ఆమె అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేస్తారని ప్రచారం చేసారు. ఏమైందో ఏమో తెలియదు గాని ఆమె కూడా షూటింగ్ నుంచి తప్పుకుంది. అసలు సినిమా చేయడానికి తనకు ఆసక్తి లేదని చెప్పింది. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది అంటూ శనివారం కాజల్ పేరు ప్రస్తావనలోకి వచ్చింది. ఇప్పుడు ఆమె కాదు రష్మిక మంధన అని అంటున్నారు. త్వరలోనే ఈమె పేరుని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

కాజల్ పారితోషికం ఎక్కువగా అడగడంతో రష్మిక మంధన పేరుని చిత్ర యూనిట్ పరిశీలించి ఆమెను సంప్రదించగా తక్కువకే ఆమె ఓకే చేసింది అని సమాచార౦. సినిమా షూటింగ్ మొదలు కాగానే ఆమె సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రష్మిక విషయంలో రామ్ చరణ్ ఆసక్తి చూపించాడు అని అందుకే ఆమె పేరుని ఖరారు చేసారని అంటున్నారు. రష్మిక ఈ ఏడాది రెండు విజయాలతో దూసుకుపోతుంది. తొలుత మహేష్ బాబు సినిమాతో హిట్ కొట్టింది. ఆ తర్వాత నితిన్ సినిమాతో హిట్ కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: