రష్మిక మందన అందాల  భామ. ఆ అమ్మడు అందం అదుర్స్. ఆమె హావభావాలు ఇంకా అదుర్స్. ఇక ఆమె లక్కు ఒక లెక్కన నక్కను తొక్కి కిక్కు ఇస్తోంది. అందుకే వరసగా సూపర్ హిట్లు ఖాతాలో పడుతున్నాయి. ఇక ఈ అమ్మడు చాలా తెలివైనది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తెలివిడి కలది.

 

ఆ కారణంగానే వచ్చిన సినిమాలను వచ్చినట్లుగా ఒప్పుకుంటూ ఓ వైపు బాగానే గడిస్తోంది.
 ఆమె ఎంతలా గడిస్తోందంటే ఆమె ఇంటి మీద ఐటీ అధికారులు  దాడులు చేసేంతగా అని చెప్పాలి. చేసినవి తక్కువ సినిమాలే అయినా ఆర్జ‌న బ్రహ్మాండంగా ఉందన్నమాట.

 

ఇకీ ఐటీ దాడుల తరువాత రష్మికలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయట. అదేంటి అంటే తన డబ్బులను ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలని. అదే సమయంలో ఆమె యువ రచయితలకు కబుర్లు పెట్టిందని టాక్. మంచి కధలు ఉంటే చెప్పమని వారికి కోరుతోందిట.

 


దీన్ని చూసిన వారు రష్మికకు కధలతో పనేంటి, ఆమె హీరోయిన్ కదా. కధలో పాత్ర ఉంటే చాలు కదా అని చర్చించుకుంటున్నారు.  అయితే తేలిన విషయం ఏంటంటే రష్మిక సినిమాలు తీయాలని నిర్ణయించుకుందిట. అంటే ఆమె నిర్మాతగా కొత్త అవతారం ఎత్తి  లో బడ్జెట్లో మూవీస్ చేయాలనుకుంటోందిట.

 

ఆ విధంగా ఓవైపు తాను నటిస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సక్సెస్ కొట్టాలని, ఆ విధంగా తన పెట్టుబడులను ఇబ్బడి ముబ్బడి చేసుకోవాలనుకుంటోందిట. మరి ఈ విషయంలో ఇప్పటిదాకా ప్రచారమే తప్ప ఆచరణ లేని ఇద్దరు సీనియర్ నటీమణులను చెప్పుకోవాలి. వారే సమంతా, కాజల్, ఈ ఇద్దరూ కూడా సినిమాలు తీస్తామని చెబుతూ వచ్చినవారే.

 

మరి నిర్మాతగా మారాలని ఆరాటపడినా ఎందుకో  వీరి అడుగులు మాత్రం ఇంతవరకూ ఆ వైపుగా పడలేదు. మరో క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన సోదరుడిని పెట్టి సినిమా తీయాలనుకున్నట్లుగా న్యూస్ వచ్చింది. ఆమె సైతం ఎందుకో అలాగే ఉండిపోయింది. మరి వీరిని కాదని రష్మిక నిర్మాతగా తొలి స్టెప్ వేస్తుందా. ఆమె సక్సెస్ కొడుతుందా అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: