గతంలో మాదిరిగా కాకుండా సినిమా నటులు తమ సంపాదనను ఇతర వ్యాపారాల వైపు మళ్లిస్తూ పెట్టుబడులు పెడుతున్నారు. ఇతర వ్యాపకాలు ఉండటం వల్ల లాభాలు, భవిష్యత్ ను దృష్ఠిలో ఉంచుకుని కూడా పలు వ్యాపారాలు చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేశ్.. ఇలా పలువరు నటులు ఇతర వ్యాపకాల వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారి బాటలోనే ఇప్పుడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అడుగులు వేయబోతున్నాడు.

 

 

ఇప్పటికే హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఉన్న సత్యం ధియేటర్ ప్రాంగణంలో చేపడుతున్న మల్టీప్లెక్స్ లో బన్నీకి పార్ట్ నర్ షిప్ ఉందని తెలుస్తోంది. ఈ వెంచర్ ను మరో డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థతో కలిసి బన్నీ నిర్మిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరో బిజినెస్ లో కూడా బన్నీ పెట్టుబడి పెట్టబోతున్నాడని అంటున్నారు. లగ్జరీ కార్లు అద్దెకు ఇచ్చే బిజినెస్ లో బన్నీ షేర్ పెట్టబోతున్నాడని టాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు, ప్రముఖల రాక సందర్భంగా ఖరీదైన లగ్జరీ కార్లను ఏర్పాటు చేయడమే ఈ బిజినెస్ టాస్క్. ఇప్పటికే ఈ రంగంలో తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నాడని సమాచారం.

 

 

దీనిపై అధికారికంగా ఎక్కడా న్యూస్ రానప్పటికీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ వార్త రౌండ్ అవుతోంది. సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు.. యువ నటులు నవదీప్ హీరోయిన్లు శ్రియ, రకుల్ ప్రీత్ సింగ్ సహా ఎంతోమంది ఇలా ఇతర రంగాల వైపు వెళుతున్నారు. బన్నీ కూడా ఇలా వ్యాపారరంగంలోకి అడుగుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: