తెలుగు సినిమాలో నటించేందుకు పరభాషా హీరోయిన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ముఖ్యంగా ముంబయి భామలు తెలుగు ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొందరైతే.. ఒక్క ఛాన్స్ అంటూ అడిగేస్తున్నారు. తెలుగులో ఎంట్రీ ఇస్తున్న హిందీ  భామలు ఎవరు.. ఈ ముద్దుగుమ్మలకు టాలీవుడ్ అంటే ఎందుకంత క్రేజో తెలుసా.. 

 

తెలుగులో ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ హవా ఎక్కువగా ఉండేది. ఈ జోరు ఆ మధ్య కాస్త తక్కువైనా.. తెలుగు సినిమాల మార్కెట్ పెరగడంతో మన హీరోలతో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బాలీవుడ్ పెర్ఫామెన్స్ బ్యూటీ ఆలియా భట్ ట్రిపుల్ ఆర్ తో తెలుగులోకి అడుగుపెడుతోంది. బాహుబలి చూసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించాలన్న ఆసక్తి కనుబరిచింది. సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సితారామరాజుగా నటిస్తుంటే.. ఆయన భార్యగా ఆలియా కనిపించనుంది. 

 

బాలీవుడ్ క్యూట్ అండ్ గ్లామర్ హీరోయిన్ అనన్య పాండే విజయ్ దేవరకొండతో జోడీ కడుతోంది. పూరీ స్వీయ దర్శకత్వంలో కరణ్ జోహార్ తో కలిసి నిర్మిస్తున్నాడు. వర్కింగ్ స్టిల్స్ ను చిత్ర బృందం ఆ మధ్య విడుదల చేసింది. ప్రముఖ హిందీ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య గతేడాది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ ఓ మూవీలో నటించగా... ప్రస్తుతం కాలా పీలి అనే మరో హిందీ మూవీ చేస్తోంది. 

 

విజయ్, పూరీ మూవీ పాన్ ఇండియాగా రూపొందుతోంది. కొత్త హీరోయిన్స్ ను తెలుగు తెరకు పరిచయం చేయడంలో ఎక్కువ అనుభవం ఉన్న పూరీ.. హిందీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ భామ అనన్యాను ఎంచుకున్నాడు. తెలుగులో హిందీ భామల సందడి ఎక్కువైంది. కియారా ఆద్వానీ.. పూజా హెగ్డేకు హిందీలో దక్కని స్టార్ డమ్ ఇక్కడ సొంతం చేసుకున్నారు. తెలుగులో టాప్ హీరోయిన్ అంటే.. ముందుగా గుర్తుకొచ్చేది పూజానే. ప్రస్తుతం తెలుగు సినిమాను ముంబయి హీరోయిన్ అని తేలడంతో.. బాలీవుడ్ హీరోయిన్స్ దృష్టి టాలీవుడ్ పై పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: