జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్న క‌ళ్యాణ్‌రామ్ బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో జౌల‌వ‌కుశ చిత్రంలో న‌టించారు. ఇక ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ కెరియ‌ర్‌లోనే ఘ‌న విజ‌యం సాధించిన చిత్ర‌మిది. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 31వ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే తెరకెక్కిస్తారని ఇటీవల ప్రచారమైంది. అయితే ఇంత‌లోనే ఎన్టీఆర్ ఒక పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పారు ఫ్యాన్స్‌కి.

 

ఎన్టీఆర్ త‌న 31వ సినిమాని వాళ్ళ అన్న బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో చెయ్య‌డం లేదని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసే 30వ‌ చిత్రం వ‌ర‌కే క‌ళ్యాణ్‌రామ్ బ్యాన‌ర్‌లో ఆయ‌న చేస్తున్న‌ట్లు చెప్పారు. 31వ చిత్రం నుంచి ఆయ‌న న‌టించే ప్ర‌తి చిత్రం తార‌క్ సొంత బ్యాన‌ర్‌లోనే  చేయ‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అందుకోసం యంగ్ యమ స్వయంగా నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపిస్తున్నారు. ఆయ‌న నాన్న‌గారి పేరు మీద బ్యాన‌ర్ ఉండాల‌న్న‌ది జూనియ‌ర్ ఎన్టీఆర్ కోరిక‌. నాన్నగారి పేరు మీద ప్రారంభిస్తున్న ఈ బ్యానర్ లోనే తన కెరీర్ లో త‌ర్వాత చిత్రాల‌న్నీ కూడా  సినిమాలు తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక హరికృష్ణ పేరు మీద ప్రారంభించే ఈ బ్యానర్ కి ఎన్.హెచ్.కె ఆర్ట్స్ అనే షార్ట్ టైటిల్ ని ప్లాన్ చేశార‌ని స‌మాచారం. ఇక ప్రొడక్షన్ హౌస్ లాంచింగ్ కి సంబంధించిన ఇంకా మిగ‌తా స‌మాచారం అంతా తెలియాల్సి ఉంది.

 

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న 30వ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌తో క‌లిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. తారక్ తన కెరీర్ 29వ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా  తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. 2021 జనవరి 8న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇక ఫైన‌ల్‌గా ఆయ‌న చెప్పేదేమిటంటే ఆయ‌న ఒక సొంత బ్యాన‌ర్ పెట్టుకుని ఆయ‌నే చిత్రాల‌ను నిర్మించుకోవాల‌నుకుంటున్నారు. ఇక ప్ర‌స్తుతం హీరోలంద‌రూ చేసే ప‌ని అదే. ఆ ప‌నిలోనే ఎన్టీఆర్ కూడా ఫాలో అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: