‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్ సమయంలో మహేష్ అనీల్ రావిపూడి పై విపరీతమైన ప్రశంసలు కురిపించడమే కాకుండా మరొక సినిమా తమ కాంబినేషన్ లో తప్పక ఉంటుంది అన్న సంకేతాలను ఓపెన్ గానే ఇచ్చాడు. దీనితో ఈఏడాది కాకపోయినా వచ్చే ఏడాది అయినా వీరిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా ఉండి తీరుతుంది అన్న అంచనాలు కొనసాగాయి. 


సంక్రాంతి వార్ లో ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ పై స్పష్టమైన ఆధిఖ్యాన్ని ప్రదర్శించడంతో మహేష్ అనీల్ రావిపూడితో మరొక సినిమాను చేసే ఉద్దేశ్యం ఇక ఉండక పోవచ్చు అని అంతా భావించారు. ఆపై సంక్రాంతి తరువాత మహేష్ అమెరికాలో ఉన్నప్పుడు అనీల్ రావిపూడి తీయబోతున్న ‘ఎఫ్ 3’ సీక్వెల్ లో ప్రత్యేక పాత్రలో మహేష్ నటిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి.


అయితే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో అనీల్ రావిపూడికి ఇంకా స్పష్టత లేకపోవడంతో ‘ఎఫ్ 3’ ప్రాజెక్ట్ వార్తలు అటకెక్కాయి. అయితే మహేష్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసిన వెంటనే అనీల్ రావిపూడిని పిలిపించి ఒక మంచి కథను వెంటనే తయారు చేస్తే తాను మే జూన్ నెలల నుండి డేట్స్ ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. 


అయితే మహేష్ ఇంత ఓపెన్ గా చెప్పినా అనీల్ రావిపూడి తన వద్ద మహేష్ కు సరిపడే కథలు లేవనీ వాటిని గురించి ఆలోచించాలి అంటే తనకు చాల సమయం అవసరం అంటూ అనీల్ రావిపూడి సున్నితంగా మహేష్ తో చెప్పినట్లు టాక్. దీనితో షాక్ అయిన మహేష్ అప్పటికే పెండింగ్ లో ఉన్న పరుశు రామ్ ను పిలిపించడం ఆపై కథ ఒకే చేయడం జరిగిపోయింది అని అంటారు. దీనితో ఒక విధంగా ఆలోచిస్తే పరుశు రామ్ కు మహేష్ తో సినిమా చేయాలి అన్న కోరిక తీరే పరిస్థితులు ఏర్పడటానికి పరోక్షంగా అనీల్ రావిపూడి కారకుడు అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: