మహేష్ పరుశు రామ్ తో మూవీ చేయబోతున్న విషయాన్ని గ్రహించిన నాగార్జున తన కొడుకు నాగచైతన్య పరుశు రామ్ లతో ఇప్పటికే మూవీ ప్రాజెక్ట్ ప్రకటించిన నేపధ్యంలో ఆ మూవీని నిర్మిస్తున్న 14 రీల్స్ నిర్మాణ సంస్థ ద్వారా మహేష్ పరుశు రామ్ ల కాంబినేషన్ మూవీకి చెక్ పెట్టె ప్రయత్నాలు చేసాడు అంటూ గాసిప్పులు వచ్చాయి. ఈ వార్తలు మహేష్ దృష్టి వరకు వచ్చి కాబోలు నాగార్జున కూడ ఊహించని షాక్ మహేష్ ఇచ్చాడు అని తెలుస్తోంది.


తెలుస్తున్న సమాచారం మేరకు దర్శకుడు పరుశు రామ్ 14 రీల్స్ సంస్థ దగ్గర అడ్వాన్స్ తీసుకుని చైతన్యతో మూవీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. అయితే మహేష్ నుండి పిలుపు రావడంతో పరుశు రామ్ మహేష్ వైపు వెళ్ళి పోవడంతో 14 రీల్స్ సంస్థ అభ్యంతరాలు చెపితే మహేష్ మూవీ ఆగిపోతుందని అంతా అనుకున్నారు. 


అయితే ఈ విషయంలో మహేష్ చాల తెలివిగా వ్యవహరించి తన లేటెస్ట్ మూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ సంస్థకు 14 రీల్స్ సంస్థకు రాజీ కుదిర్చి వారి భాగస్వామ్యంలో తన సినిమా ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు అని అంటారు. దీనితో 14 రీల్స్ సంస్థ నాగచైతన్యతో సినిమా అనుకుంటే ఏకంగా మహేష్ మూవీ తమకు వచ్చి పడటంతో అప్పటి వరకు అభ్యంతరాలు వ్యక్తం చేసిన 14 రీల్స్ సంస్థ నిర్మాతలు మహేష్ రాజీ మార్గానికి ఓకె చెప్పడంతో కథ సుఖాంతం అయింది అని అంటున్నారు.


దీనితో నాగార్జునకు పరుశు రామ్ పై కోపం వచ్చినా పరిస్థితులు అనుకూలించక పోవడంతో అతడు కూడ పరుశు రామ్ మహేష్మూవీ ప్రాజెక్ట్ కు తనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఓకె చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ఎలాంటి వివాదాన్ని అయినా కూల్ గా పరిష్కరించే మహేష్ చిరునవ్వు అన్నింటికీ సమాధానం అంటూ కొందరు జోక్ చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: