సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతున్నాడు. ఈ సంక్రాంతికి త‌న 26వ సినిమా అయినా స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్ ఇప్ప‌టికే మూడు వ‌రుస హిట్ల‌తో హ్యాట్రిక్ కొట్టేశాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన భ‌ర‌త్ అనే నేను సినిమాతో ప్రారంభ‌మైన మ‌హేష్ విజ‌యాల ప్ర‌స్థానం ఆ త‌ర్వాత త‌న కెరీర్‌లో 25వ సినిమాగా వ‌చ్చిన మ‌హ‌ర్షి సినిమాతో హిట్ కొట్టాడు. ఇక 26వ సినిమాగా వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా సైతం సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో మ‌హేష్ మార్కెట్‌, రేంజ్‌, క్రేజ్ బాగా పెరిగి పోయాయి.

 

ఇక ఇప్పుడు మ‌హేష్ త‌న నెక్ట్స్ సినిమా కోసం చాలా టైం తీసుకుంటున్నాడు. వాస్త‌వానికి మ‌హేష్ 27వ సినిమా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో  చేయాల్సింది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాలి. అయితే ఈ సినిమా కోసం వంశీ రెడీ చేసుకున్న క‌థ మ‌హేష్‌కు న‌చ్చ‌లేదు. దీంతో మ‌హేష్ సినిమా డిలే అవుతూ వ‌చ్చింది. ఇక ఇప్పుడు మ‌హేష్ 27వ ప్రాజెక్టుపై క్లారిటీ వ‌చ్చేసింది. ఈ సినిమా మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ‌ల‌తో పాటు మ‌హేష్‌ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థలు క‌లిసి నిర్మిస్తాయ‌ట‌.

 

ఇక ఈ సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు ప‌ర‌శురాం. శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు, గీత‌గోవిందం లాంటి సినిమాల‌తో త‌న స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసుకున్న ప‌ర‌శురాం క‌థ మ‌హేష్‌కు బాగా న‌చ్చింద‌ట‌. ఇక మే నెల నుంచి లాంఛ‌నంగా షూటింగ్‌ ప్రారంభించి.. జూలైలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌ని సినిమా యూనిట్ భావిస్తోంద‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ బూచీ గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఈ క్ర‌మంలోనే అన్ని భాష‌ల్లో సినిమాల షూటింగ్‌లు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో సినిమా ప్రియులు సైతం సినిమాలు లేక సినిమా వార్త‌లు లేక అల్లాడి పోతున్నారు. ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా బూచి అంత‌మై మ‌ళ్లీ సినిమాలు రిలీజ్ కావాల‌ని కోటి క‌ళ్ల‌తో వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: