సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించే కొద్దీ  హీరో రెమ్యునిరేషన్ కూడా భారీగా పెరిగి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. హీరో క్రేజ్ ఎంత పెరిగితే అంత కు మించి రెమ్యూనరేషన్ పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పారితోషికం విషయంలో కూడా అదే జరిగినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ పారితోషికానికి సంబంధించిన వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక తనదైన కామెడీ టైమింగ్ తో అద్భుతమైన యాక్షన్ తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు అల్లుఅర్జున్. 

 

 

 అయితే తాజాగా అల్లు అర్జున్ తన పారితోషికాన్ని భారీగా పెంచాడు అనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన అలా వైకుంఠపురములో  సినిమానే అని అర్థమవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా అలా వైకుంఠపురం నిలిచింది. ఏకంగా వరల్డ్ వైడ్ గా  మంచి వసూళ్లను కూడా రాబట్టింది. దీంతో అల్లు అర్జున్ మార్కెట్ కాస్త పెరిగిపోయింది. ఈ సినిమా మొత్తంగా నూట యాభై కోట్లకి పైగా షేర్ సాధించింది అని సమాచారం. ఇక ఈ సినిమా సంచలన విజయం సాధించడం..బన్నీ  మార్కెట్ పెరిగింది అని భావించి.. తన పారితోషికాన్ని భారీగా పెంచేసాడట  అల్లు అర్జున్. 

 

 

 దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా  మారిపోయింది. అంతకుముందు వరకూ ప్రతీ సినిమాకీ 15 కోట్ల వరకూ పారితోషకం తీసుకునే అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో  తర్వాత చేస్తున్న నెక్స్ట్  సినిమాకి మాత్రం ఏకంగా తన పారితోషికాన్ని రెట్టింపు చేశాడట. ప్రస్తుతం అల్లు అర్జున్ తదుపరి సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో... టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా రెండవ షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. ఇక అల్లు అర్జున్ ఒక్కసారిగా పారితోషికం పెంచేయడంతో అటు నిర్మాతలు కూడా ఆందోళన చెందుతున్నారు అట.

మరింత సమాచారం తెలుసుకోండి: