స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. అల వైకుంఠ‌పుర‌ములో సినిమా ఇండ‌స్ట్రీలో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రాస్ చేయ‌డంతో పాటు బ‌న్నీ కెరీర్‌లోనే టాప్ హిట్‌గా నిలిచింది. అప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా రికార్డులు రంగ‌స్థ‌లం పేరు పైన ఉండ‌గా వాటికి అల పాత‌రేసేసింది. అలాగే ఇండ‌స్ట్రీలో నాన్ బాహుబ‌లిని వ‌దిలేస్తే స‌రికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. 

 

ఇక ఈ సినిమా ఏకంగా రు. 160 కోట్ల షేర్ సాధించి టాలీవుడ్ ట్రేడ్ పండితుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. ఇక ఇప్పుడు బ‌న్నీ త‌న నెక్ట్స్ సినిమాను క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సూప‌ర్ డూప్ హిట్ అవ్వ‌డంతో బ‌న్నీ ఈ సినిమా కోసం అతను దాదాపుగా 15 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు బ‌న్నీ త‌న మార్కెట్ బాగా పెర‌గ‌డంతో త‌న రేటు కూడా పెంచేసిన‌ట్టు స‌మాచారం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సినిమా కోసం ఏకంగా రు. 20 కోట్లు తీసుకుంటున్నాడ‌ట‌. ఈ రేటు చూసి అటు ద‌ర్శ‌క నిర్మాత‌లు సైతం షాక్‌లో ఉన్నార‌ట‌. మ‌నోడు ఎంత మాత్రం త‌గ్గేది లేద‌ని చెప్ప‌డంతో వాళ్లు సైతం అడిగినంత స‌మ‌ర్పించు కోక త‌ప్ప‌డం లేద‌ట‌.

 

సినిమా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా చేస్తోంది. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్లో కొద్ది రోజుల పాటు షూట్ చేశారు. బ‌న్నీ సినిమాలో లారీ డ్రైవ‌ర్ అని.. గంధ‌పు చెక్కల స్మ‌గ్ల‌ర్ అని చెపుతున్నారు. దీంతో బ‌న్నీ పాత్ర ఎలా ఉంటుందా ?  అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.  ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. బ‌న్నీ వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతుండ‌డంతో పాటు బ‌న్నీ - సుకుమార్ ఇద్ద‌రూ ఫామ్‌లో ఉండ‌డంతో ఈ సినిమా మ‌ళ్లీ టాలీవుడ్ టాప్ లేపుతుంద‌ని అంటున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: